ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Tuesday, February 1, 2011

అవినీతి మీద పోరాటం ప్రారంబింఛేది ఎవరు?

ఖచ్చితంగా, చదువున్న వాళ్ళం మాత్రం కాదు. ఎందుకంటే మనమందరము ఆ తానులో ముక్కలమే.  మద్యపాన నిషేదం గురించి గోదావరిఖనిలో నక్సలైట్‌లు, దూబకుంటలో మహిళలు పోరాటం మొదలుపెట్టినట్టు అలాంటి వాళ్ళే మొదలుపెట్టాలి.

మనం అవినీతి మీద పోరాటం ఎలాగూ చెయ్యలేము, కనీసం నిజాయితీగా పనిచేసేవారికి అండగా కూడ నిలబడము. 1996 లో అనుకుంటాను, ఒకే నెలలో హైదరాబాద్‌లో, అప్పట్లో నిజాయితీగా ఉన్న ముగ్గురు IAS ఆఫీసర్లను ఒకే నెలలో, చంద్రబాబు నాయిడు ట్రాన్స్‌ఫర్ చేస్తే, పాపం శర్మగారు అనుకుంటాను, ఆయన గురించి మాత్రం ఫిల్మ్‌నగర్ గుడిసెవాసులు కొద్దిగా పోరాటం చేసి, వాళ్ళ వల్ల కాక విరమించుకున్నారు. అమృతా కాజిల్ మీద యాక్షన్ తీసుకోబొయిన శ్రీమతి. సుజాతారావుకి గానీ, కారణం సరిగ్గా గుర్తులేదు శ్రీ. బ్రహ్మ గారికి కానీ ఆ మాత్రం సపోర్ట్ కూడా దొరకలేదు. (అప్పట్లో అని ఎందుకన్నానంటే, వాళ్ళు నిజాయితీగా ఇప్పటికీ ఉంటే, వాళ్ళ ట్రాన్స్‌ఫర్స్ గురించి రోజూ చదువుతూనే ఉండేవాల్లము) ముగ్గురూ నిజాయితీగా పనిచేసినందుకు వాళ్ళకు దొరికిన బహుమానం అది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకనో 1998 లో నిజాయితీగా వున్న సుబ్రమణ్యం అనే IFS ఆఫీసర్‌ని మాత్రం, ఎన్ని ఒత్తిల్లు వచ్చినా బదిలీ చెయ్యకుండా ఆపుచేసి, కొల్లేరు చెరువు ఆక్రమణల బారిన పడకుండా కాపాడేడు. ఆయన వలన, అప్పట్లో చెరువులు తవ్వలేక నష్టపోయిన వాళ్ళల్లో నేను ఒకడిని. నిజంగా ఆయన ఒక్కడి వలన, సుమారు రెండున్నర సంవత్సరాల పాటు కొల్లేరులో, చెరువుల తవ్వకం ఆగిపోయింది. ఆయన్ను బదిలీ చేయించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ పనిచెయ్యలేదు. నేను పర్సనల్‌గా నష్టపోయి వుండవచ్చు, కానీ ఆయన నిజాయితీకి మాత్రం చాలా ఆనందించేవాడిని. ఒక్కడ్నీ, ఏమి చెయ్యగలనులే అనుకొనే నాకులాంటి వాళ్ళకి, జయప్రకాష్‌ నారాయణ, గద్దర్ లాంటి వాళ్ళకి ఆయన, పూనం మాలకొండయ్య లాంటి వాల్లు చేసి చూపించారు.

ఇక్కడ, గద్దర్ ప్రస్తావన ఎందుకంటే, నాకు ఎప్పుడో చదివిన గుర్తు, ఆయన్ని ఒక విలేఖరి మీరు ఇంజనీరింగ్ ఎందుకు మానేసారు అంటే ఇసుకలో సిమెంట్ కలపించలేక అని సమాదానం చెప్పారు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ చదువుతో మానేసాడంట. తుపాకీ పట్టుకోవడానికి ఉన్న దైర్యం ఉద్యోగం చేయడానికి లేదన్నమాట. ఈ మాటలన్నీ భాద్యత నుండి పారిపోయే మనస్తత్వాన్ని చూపిస్తాయి. అధికారం ఉండి, ఏమీ చెయ్యలేని వాళ్ళకు వ్యవస్థని నిందించే అర్హత లేదు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ మాత్రమన్నా ఉన్నామంటే, కొద్దిమందైనా నిజాయితీపరులు వుండబట్టే. కానీ కనీస భాద్యతగా మనం వాల్ల వెనకాల నిడబడనందుకే, అవినీతి అరోపణలున్నా సిగ్గూ, ఎగ్గూ లేకుండా థామస్ లాంటి వాల్లు CVC లు, నవీన్ చావ్లా లాంటి వాల్లు CEC లు అవుతున్నారు. కానీ ఈ నిజాయితీపరులకు కూడా, కొద్ది కాలానికి నిర్వేదం వచ్చేస్తుంది. ఈ రోజు శ్రీమతి. పూనం మాలకొండయ్య ఎక్కడ వున్నారో కూడా తెలియడం లేదు. ఎవరి గురించి అయితే వాళ్ళు కష్టపడుతున్నారో, వాళ్ళే వాల్ల వెనుక నిలబడకపోతే, వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు ట్రాన్స్‌ఫర్‌ల మీద ఊరూరూ తిరగగలరు. సింగరేణి ఎం.డిగా చేసి కోల్ మినిష్ట్రీకి వెల్లిపోయిన శ్రీ. మహాపాత్రో ఇంటి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు? (అలా అని కేస్ క్లోజ్ చేసారు, ఆయన అంత పిరికివాడు కాదు), అదే సమయంలో, మారుతి ఎం.డి. భాస్కరుడి కారుని, నెంబర్ ప్లేట్ లేని లారీ గుద్ది వెల్లిపోయినప్పుడు(అప్పుడు మారుతీకి, సుజుకీ కి గొడవలు నడుస్తున్నాయి) దాని మీద ఎటువంటి ఎంక్వరీ జరగకుండా అడ్డుకున్నదెవరో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. జర్నలిస్ట్‌లు కూడా వ్రాయలేదు. అంటే వీళ్ళని కూడా కొనేసివుంటారా?


ఈ రోజు ఏ పోరాటం చెయ్యాలన్నా నిరక్షరాశ్యులు చెయ్యాలితప్పితే, చదుకున్నవాళ్ళు మాత్రం చేయడం లేదు. మరీ ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఇక్కడ పోరాడలేమనే భయంతో తుపాకులు పట్టుకొని అడవుల్లోకి పారిపోతున్నారు. ప్రజల గురించి ఆలోచించేవాల్లు వుంటే కష్టమని ఛిఛీదంబరం, మన్ మోషం సింగులు వాళ్ళ వెనకాలపడి చంపేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే 47 సంవత్సరాల వయసువున్న నాకే నక్సలైట్‌గా మారిపోదామని అనిపిస్తోంది.

కానీ ఈ రోజు అన్ని సమస్యలకు కారణం అవినీతేనని, అది పోతే, ప్రాంతాలకతీతంగా దేశం మొత్తం బాగుపడుతుందని తెలిసినా, యువత రాజకీయనాయకుల కుతంత్రాలకు లొంగిపోయి, మన రాష్ట్రవిషయానికి వస్తే తెలంగాణా అని, సమైకాంద్రా అని వ్యర్ద పోరాటాలలో మునిపోయారు. ఇక్కడ రాజకీయనాయకులని ఈరోజు దాకా ఒరేయ్ కొడకల్లారా, మాట్లాడితే ఆంధ్రావాళ్ళు గత 60 సంవత్సరాల నుండి దొచేస్తున్నారు అని అంటున్నారు, మీరు అక్కడ ఉండి, ఎవరి చంకలు నాకుతున్నారు అని అడగలేదు. ఈ రోజు KCR పిచ్చి పట్టినట్టు వాగుతుంటే ఒరేయ్, పిచ్చి నా.....కా ఇలా వాగితే, ప్రేమకు ప్రతిరూపాలైన తెలంగాణా ప్రజలు, నీ మొహం మీద ....పోస్తారురా అనేవాళ్ళు కనిపించడంలేదు. ఎందుకంటే ఈ తెలంగాణా ప్రేమను 1983 నుండి పొంది, వీర తెలంగాణా అభిమానిగా మారిన నేను, అతని భాషని చూసి, ఈ రోజు మిగిలిన దేశమంతా నా తెలంగాణా ప్రజల్ని ఎక్కడ అసహ్యించుకుంటుందో అని బాధపడుతున్నాను. చదువు చెప్పే వృత్తిలో వున్న ప్రొ. కోదండరామ్ సంస్కారం ఎక్కడకు పోయింది?  


ఈ పరిస్థితుల్లో ఎవరు నిజాయితీగా ఉంటారు? ఉండమనే హక్కు మనకెక్కడ ఉంది?