ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Wednesday, January 15, 2014

చాలా కాలం అయ్యింది బ్లాగ్ వ్రాసి, ఎందుకనో ఈ రోజు మళ్ళీ రాయాలనిపించింది. ఏమి వ్రాయాలి? మనసు చాలా భారంగా ఉంది. ఏదో కాలక్షేపానికి అని ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసాను. కానీ చివరికి అది నాకు సమయం చాలకుండా చేసింది. కాలక్షేపం అనుకున్నది కాస్తా వ్యసనమయ్యి కూర్చుంది. ఒక విధంగా మంచే జరిగింది అనిపిస్తోంది.  

గతం గతః




మన జాతి ఇలా ఎందుకుందో తెలుసుకోవలసిన అవసరం, మనకు మునుపు కంటే ఇప్పుడే ఎక్కువ కనిపిస్తోంది. "గతం గతః" అనే భావనను, మన పెద్దలు మన మంచి కోరి వ్యాప్తి చేసారు. అది వ్యక్తిగతంగా అనవసర శతృభావనలు ఉండకూడదు, జరిగిన చెడుని మరచిపోయి, తిరిగి మామూలు జీవితం గడపాలి అనే సదుద్ధేశ్యంతో మనకు ఎప్పుడూ చెపుతుంటారు. కానీ అలా అనుకోవడం జాతికి కూడా అన్వయించేసుకుంటున్నాము మనము. చరిత్రని మరచిన ఏ జాతీ ప్రపంచాన్ని ఏలలేదు, చరిత్ర నుండి ప్రేరణ పొందాలి, జరిగిన అవమానాలు గుర్తుచేసుకోవాలి, పైకి ఎదగాలి. అది మన జాతిలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మన జాతి ప్రపంచాన్ని ఏలుతుంది. 

నేను, నాథూరాం గాడ్సే మరణ వాంగ్మూలం పుస్తకం తెప్పించమని ఒక ఆర్.ఎస్.ఎస్ ముఖ్యుడిని అడిగాను. దానికి ఆయన ఇప్పుడు, గాంధీ లేడు. గాడ్సే లేడు, అవి చదివి మనం తెలుసుకోవడం వలన ఏమన్నా ఉపయోగం ఉందా అని అన్నారు. ఈ భావన పోవాలి. చరిత్ర నిజాయితీగా తెలుసుకోవాలి, తప్పొప్పులు చూసుకోవాలి.

కనీసం మన పాఠ్య పుస్తకాలలో నిజాన్ని చెప్పాలి, బాబ్రీ మసీదు, కాశీ విశ్వేశ్వరాలయం, తేజో మహల్, కుతుబ్ మీనార్ల గురించిన నిజాలు పిల్లలకు చెప్పాలి. రాజమండ్రి లాంటి ప్రాంతాలలో కూడా దేవాలయాలు కూలగొట్టిన విషయాలను తెలియచెయ్యాలి. పనికిరాని సీరియల్స్ ప్రచురించే వార్తా పత్రికలు, చరిత్రను రచయితలతో వ్రాయించి, అవి సీరియల్స్‌గా ప్రచురించాలి.


ముదిగొండ శివప్రసాద్, శ్రీ ప్రసాద్ గార్ల వారసులను వెతకాలి. కొద్దిగా నాయకీయత జోడించాలి తప్పదు, మన దౌర్భాగ్యం కొద్దీ పిల్లలకు చరిత్ర అంటే అంత ఇష్టం కలగడం లేదు.

 పిల్లలను చిన్నతనం నుండే, భారతీయులం మనం ప్రపంచానికే మార్గదర్శ్డకులం అనే గర్వాన్ని పెంచాలి, ఇంగిలిపీసులో చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచాలి, మళ్ళీ తిరిగి మనం "ప్రపంచానికి మార్గ దర్శకులం కావాలి" అనే పట్టుదల పెంచాలి. 

ఇవన్నీ జరిగిన రోజు మాత్రమే ఈ జాతి పతాకం ప్రపంచ వీధుల్లో ఎగురుతుంది.

జై భరతమాత.