ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Wednesday, November 4, 2015

అసహనం



గత నెల రోజులుగా భారతదేశంలో "హిందువుల్లో అసహనం" పెరిగింది అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇది చాలా విచిత్రమైన వాదన. దీనిని చూసి గర్వపడాలో, లేక కొన్ని వేల సంవత్సరాల అవహేళన తరువాత, ఒకటి రెండు సంఘటనలకే ఇంత అల్లరి జరుగుతున్నందుకు, తమ చేతకాని తనానికి సిగ్గుపడాలో అర్ధం కావడం లేదు. అన్నిటికంటే హాస్యాస్పదం ఏమిటంటే, ఈ నెల రోజుల్లోనే, గోవధను వద్దన్నందుకు ఒక హిందువుని, మసీద్ ముందు హారన్ కొట్టాడని ఇంకొక హిందువును చంపారు. కానీ, ఈ సిక్యులరిస్టులకు ఈ రెండు సంఘటనల మీద కూడా స్పందించాలి అని అనిపించలేదు.

ఈ దేశ దౌర్భాగ్యం, రాష్ట్రపతి స్థానంలో కూర్చున్న వ్యక్తులు కాంగ్రెస్ కొమ్ముకాయడం. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి నిలబడినప్పుడు, మన ప్రణబ్ ముఖర్జీ గారు, జైలులో ఉన్న ఆర్ధిక నేరగాడు (?) జగన్‌ని కలసి ఓటు వేయించవలసిందిగా ప్రాధేయపడి రావడం. ఆ స్థానానికి పోటీ పడే వ్యక్తి, పాటించవలసిన కనీస పద్ధతిని కూడా పాటించని వ్యక్తి, అధికారంలోకి వచ్చాకా ఇలా కాక, ఇంకెలా ఉంటాడు?

మొత్తానికి హిందువు, అతి కొద్ది అసహనం ఇన్ని ప్రకంపనలను సృష్టించింది అంటే, నిజంగానే హిందువు ఆ అసహనంతో తిరుగుబాటు చేస్తే, ఈ అవార్డుల డబ్బా రాయుళ్ళందరూ ఎక్కడకు పరిగెడతారు? షారూక్‌ఖాన్ లాంటి ముసల్మానులకు పరవాలేదు, ముష్టోడిలా భావించి, పాకిస్థానో, సౌదీ అరేబియానో రానిస్తారు. కానీ ఈ హిందూ కుహనా లౌకిక వాదులను ఏ దేశం రానిస్తుంది? చైనానా లేక ఇటలీనా? ఇటలీ గురించి నాకు అంతగా తెలియదు, చైనా వెళితే మాత్రం, ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే, రెండో నిముషం యమధర్మరాజు దర్శన భాగ్యాన్ని పొందుతారు.