ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, June 16, 2012

ప్రైవేట్ పెత్తనం.


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదానికి కారణం ఎవరూ అని అడిగితే, అది ఖచ్చితంగా ఈ బూర్జువా ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అసలు మన దేశం ఎటు పోతోందో సామాన్యులెవరికీ అర్థం కావడం లేదు. అర్థమైన వాళ్ళు హాయిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వాటిని మనం ఎన్ని చూడవలసి వస్తుందో.
మన్ మోసం సింగులు, అహ్లూవాలియాలు ఈ దేశానికి పట్టిన శనులు. వాళ్ళ పీడ ఎప్పుడు వదులుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చేతిలో కొద్దిగా పైసలు, సవరించగల మెలకువలు తెలిస్తే చాలు, ఈ దేశంలో ఏదైనా చేసుకోవచ్చు అనే స్థితికి ఈ దేశాన్ని దిగజార్చేసారు. ఈ కొడుకులు వాళ్ళ పెళ్ళాలతో కాపురాలు తప్ప, మిగిలినవన్నీ  ఔట్ సోర్సింగే అనే మంత్రం జపిస్తున్నారు. ఒక ప్రభుత్వ శాఖకు కావలసిన భవనాలు ఎవడో బయటి వాడు, వాడి ఇష్టమొచ్చిన రేటుకు, ఇష్టమొచ్చిన డిజైన్‌తో, ఇష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన క్వాలిటీతో కట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఏ శాఖలోనూ డిజైన్ వింగ్ అనేది లేదు. దేశ వ్యాప్తంగా వేల కోట్లతో ఇ.ఎస్.ఐ. హాస్పిటల్స్ కడుతున్నారు, దానిని పర్యవేక్షించడానికి దానికంటూ ఒక యంత్రాంగం లేదు. పూర్వం అలాంటి పనులన్నీ సి.పి.డబ్ల్యూ.డి. వాళ్ళు చూసేవారు. ఇప్పుడు డిజైన్ చేసేవాడు ఒకడు, ఆర్కిటెక్ట్ ఒకడు, కట్టేవాడు ఒకడు, పర్యవేక్షించే వాడు ఒకడు. అసలు వీళ్ళల్లో ఒక్కడు కూడా ప్రభుత్వం తరపున ఉండడు. ఈ జాడ్యం దానికొక్కదానికే పరిమితం కాలేదు. దేశ రక్షణ వ్యవస్థకు మూల స్థంభం అయిన డి.ఆర్.డి.వో లో కూడా ఇదే జాడ్యం. ప్రతీది ఔట్ సోర్సింగ్. ప్రైవేట్ వాడికి భాధ్యత ఎంత వరకు ఉంటుంది.

ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 10mm మందం ఉండవలసిన  పైపుల స్థానంలో 5mm మందానివి వాడారంటున్నారు. వాడు కడతాడు, వీడు వాడతాడు. పెళ్ళి చేసుకొనేవాడు ఒకడైతే, శోభనం చేసుకునే వాడు ఇంకొకడు అన్నట్టు తయారయ్యింది ఈ దేశం. తాహతుని మించి ఒక కంపెనీకే వర్కులు ఇవ్వడం, వాడు దానిని ఇంకో నలుగురికి సబ్ ఇవ్వడం. ప్రతీ ఒక్కడూ కనీసం 10 శాతం లాభం వేసుకున్నా, అది నాలుగు చేతులు మారేసరికి క్వాలిటీ సగం పడిపోతుంది. అడిగే వాడు ఎవడు? పూర్వం ఒక డ్రాఫ్ట్‌మెన్ డిజైన్ చేస్తే దానిని పైన నలుగురు చెక్ చేసి కానీ ఓకె అనేవారు కాదు. ఇప్పుడు వాడి దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఉన్నాడో మనకు తెలియదు, వాడీకి పార్లమెంటులోనో, లేక అసెంబ్లీలోనే పలుకుబడి ఉంటే చాలు వాడు ఒక కన్స్‌ల్‌టెంట్, వాడికి దేశ వ్యాప్తంగా వర్కులు. దీనమ్మా ఈ ఔట్‌సోర్సింగ్ అనే ప్రక్రియనుe, ఏ ఉద్దేశ్యంతో మొదలుపెట్టారో కానీ వ్యవస్థ సర్వనాశనం అయిపోతోంది. ఒక చిన్న అనుమానం తీర్చడానికి కూడా కన్స్‌ల్టెంట్ రావలసిందే. నేను సంవత్సరం క్రితం చేసిన కంపెనీ వర్కులో అయితే కన్స్‌ల్టెంట్ ఒక మోనార్క్. వాడిని కాదనే ధైర్యం ఈ రాష్ట్రానికే హెడ్ అయిన వ్యక్తి కూడా లేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

 ఈ ఔట్ సోర్సింగ్ అనే దాని పీడ పోతే కానీ ఎక్కడా క్వాలిటీ రాదు.  వాళ్ళ మీద అజమాయిషీ చేసే ధైర్యం ఎవడికీ లేదు. మన జలయజ్ఞం దానికొక పెద్ద ఉదాహరణ. ఇంకా మనం ఎన్ని చూడాలో.

సామాజికన్యాయం అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.

సరిగా చదువుకోకపోతే ఎంత నష్టమో నాకు ఇప్పుడు అర్ధం అవుతోంది. మా ఫాదర్ చెప్పినట్టు నేను చిన్నప్పుడు మంచిగా చదువుకుని  వుంటే నాకు ఈ అనుమానం వచ్చేది కాదేమో? లేకపోతే లోకమంతా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే నాకు దాని గురించి తెలియక నేను బిక్క మొగం వేయడమేమిటి? లేదూ నేను పెరిగిన వాతావరణం, నన్ను అటువంటి వాటి గురించి, ఆలోచించే అవకాశం ఇవ్వలేదు అనడానికి లేకుండా నా తండ్రి ఎంతో మంది బీద విద్యార్ధులకి ఫీజ్ కట్టి చదివించిన మనిషి, మేము ఎప్పుడైనా, మా అసమర్ధతని కప్పిపుచ్చుకోవడానికి, ఆ వాడు రిజర్వేషన్ మీద సీట్ కొట్టేసాడు అంటే, ఒరేయ్ వెధవల్లారా, మిమ్మల్ని పందుల్ని మేమినట్టు మేపి, మీరు ఏది కావాలంటే అది కొనిచ్చి, ట్యూషన్‌ల ట్యూషన్‌లు పెట్టించి, ఎంత కావాలంటే అంత డబ్బిచ్చి చదువుకోండిరా అంటే 35 మార్కులు తెచ్చుకోవడానికి చచ్చిపోతూ, వాళ్ళ మీద పడి ఏడుస్తారెందుకురా అని తిట్టే మనిషి కాబట్టి నేను అటువంటి వాతావరణంలో   పెరిగినవాడిని కాదు. మరి అందరికీ అర్ధమైన ఈ సామాజిక న్యాయమనేది నాకు ఎందుకు అర్ధం కావడం లేదు?

పోనీ ఉద్యోగమా అంటే నేను చదివింది సివిల్ డిప్లొమా. ప్రొద్దుట లేచింది మొదలు లేబర్‌తోనే పని. వాడు ఒక్కరోజు పని మానేసాడంటే ఆరోజు మా పని అయ్యిపోయినట్టే, కాబట్టి వాడి విలువ నాకు తెలుసు. చేసింది తెలంగాణాలో వున్న సింగరేణిలో, దరిదాపులదాకా అప్పట్లో 1,00,000 పైనే నిరక్షరాశ్యులు ఉన్న కంపెనీ, కాబట్టి నాకు ఊహవఛ్ఛాకా ఈ 30 (నేను నా 17 వయేట ప్రభుత్వోద్యోగంలో చేరాను, ఇప్పుడు నాకు 47) సంవత్సరాలలో, ఎవడూ నాకంటే ఎక్కవా కాదు, నాకంటే తక్కువా కాదు అనే పరిస్థితుల్లోనే పెరిగాను. మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ విననిది ఇప్పుడు ఎందుకు వింటున్నాను?