ఏదయినా పని
మొదలుపెట్టక ముందు ఆలోచించాలి కానీ, మొదలుపెట్టాకా
ఇక దాని గురించి ఆలోచించకూడదు.ఇది నరేంద్ర మోడీ నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానీ, ఆర్టికల్
370 నుంచి మొదలయిన రచ్చ, ఇప్పుడు
విద్యా వ్యవస్థకు, యూనిఫాం సివిల్ కోడ్ మీదకు మళ్ళింది. ఇంకా ఇటువంటివి ఏమయినా
ఉన్నాయేమో చూసి అవి కూడా ఆయనకు చెప్పి వాటి మీదకు కూడా దృష్టి పెట్టేటట్టు
చెయ్యవలసిన అవసరం మనకు ఉంది. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం
పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి.
ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా
ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి. అంతే కానీ రోజుకొకటి చొప్పున మొదలుపెట్టి ఈ దేశం
ఉన్నంత కాలం వాటిని అలా పొడిగించుకుంటూ వెళ్ళడం వలన ఏ పనీ సరిగ్గా కాదు. అనవసర
మొహమాటాలు అనవసరం.
ఆయనన్నట్టు
ఆయన చేసేది మంచి పనే కదా (కనీసం నాలాంటి ఊరోళ్ళ దృష్టిలో)