ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, May 31, 2014

ఏదయినా పని మొదలుపెట్టక ముందు ఆలోచించాలి కానీ, మొదలుపెట్టాకా ఇక దాని గురించి ఆలోచించకూడదు.ఇది నరేంద్ర మోడీ నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానీ, ఆర్టికల్ 370 నుంచి మొదలయిన రచ్చ, ఇప్పుడు విద్యా వ్యవస్థకు, యూనిఫాం సివిల్ కోడ్ మీదకు మళ్ళింది. ఇంకా ఇటువంటివి ఏమయినా ఉన్నాయేమో చూసి అవి కూడా ఆయనకు చెప్పి వాటి మీదకు కూడా దృష్టి పెట్టేటట్టు చెయ్యవలసిన అవసరం మనకు ఉంది. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి. ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి. అంతే కానీ రోజుకొకటి చొప్పున మొదలుపెట్టి ఈ దేశం ఉన్నంత కాలం వాటిని అలా పొడిగించుకుంటూ వెళ్ళడం వలన ఏ పనీ సరిగ్గా కాదు. అనవసర మొహమాటాలు అనవసరం.


       ఆయనన్నట్టు ఆయన చేసేది మంచి పనే కదా (కనీసం నాలాంటి ఊరోళ్ళ దృష్టిలో)

Saturday, May 24, 2014

మొన్న రాత్రి CNN-IBN లో అనుకుంటా, కర్ణాటకు చెందిన జ్ఞానపీఠ్ (?) అవార్డు గ్రహీత, మోడీ ప్రధాని అయితే దేశం విడిచి వెళ్ళిపోతానన్న అనంతమూర్తి, మన దేశంలో స్త్రీలల్లో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేటట్టు నటించిన ఇద్దరు స్త్రీ మూర్తులలో ఒకరు, తను మైనారిటీ కాబట్టి తనకు ఎవరూ ఇల్లు అమ్మడం లేదు (తనకు తక్కువ డబ్బు ఇస్తే తను చేస్తుందో లేదో నాకు తెలియదు) అని వాపోయిన షబానా అజ్మీల మాటలు విన్నాకా నాకు అనిపించింది ఏమిటంటే, ఈ దేశంలో మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ మాత్రమే అని, వాళ్ళను చంపితే మాత్రమే వీళ్ళ హృదయాలు ద్రవించి నీరై పోతాయని, అదే మైనారిటీలుగా ఉన్న సిక్కులను, జైనులను కానీ, కాశ్మీరులో హిందువులను కానీ చంపితే వీళ్ళకు ఏమీ అనిపించదని.

అదే 1984లో డిల్లీలో మూడు వేల మంది సిక్కులను చంపేసినా, చంపిన వాళ్ళు కాంగ్రెస్ హిందువులు కాబట్టి వీళ్ళకు ఆ మారణకాండ కనిపించలేదని, హిందువులు అయినా, ఇక వేరే మతస్థులు ఎవరైనా కాంగ్రెస్, కమ్యూనిస్టుల వాళ్ళు అయ్యి మైనారిటీలను చంపినా అది తప్పు కాదని వీళ్ళు చెపుతున్నారు. అంతే కాదు, మన జ్ఞాన్ అనంతమూర్తి గారయితే ఇంకొక అడుగు ముందుకు వేసి, ఆ ఘోరాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను, నేను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను అని కూడా చెప్పాడు. ఇంతకీ అదే మాట అనుకుంటున్నారు, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదట, మోడీ గురించి ఆయన అన్నమాటట. పైగా అప్పుడు ఆయన ఆ వేదనలో ఉండి దేశం విడిచివెళ్ళిపోతానని అన్నడట కానీ, ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదట. మనమే ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నామంట.

మరి అంత జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానపీఠం మీద కూర్చున్నవాడు నోరు జారితే, మరుసటి రోజైనా నేను ఏదో వేదనలో ఉండి అన్నాను కానీ, నా మాతృభూమిని వదిలి నేను ఎందుకు వెళతాను అని సరి చేసుకోవాలి కదా. అలా చెయ్యకపోవడం ఆయన తప్పు కాదంట, మనం వెళ్ళిపొమ్మనడం మన తప్పంట. మనమేమీ ఊరికే వెళ్ళిపొమ్మనలేదు కదా, ఆయన జ్ఞానపీఠం మీద ఉన్నాడు కాబట్టి, కొద్దిగా అన్నా జ్ఞానాన్ని చూపిస్తాడని ఆయన మాట ఆయనకు గుర్తు చేసాము. దానికి మనల్ని తప్పు పడితే ఎలా? నాకు ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఏమన్నా తప్పు మాట్లాడామా?

Wednesday, May 14, 2014

నేను సివిల్ డిప్లొమా పూర్తి చేసింది 1981 లో అయినా, మా నాన్నగారు సివిల్ ఇంజనీరింగులో లెక్చరరే కాకుండా చార్టర్డ్ ఇంజనీరు కూడా కావడం వలన 1978 నుండీ నా ఫీల్డుతో నాకు పరిచయం ఉంది. ఆ అనుభవంతో చెపుతున్నాను.
మా ఫీల్డు ఎన్‌డియే, తెలుగుదేశం హయాం నుండి సర్వనాశనం అయ్యిపోయింది. అప్పటి దాకా ఒక పనిని పది మంది కాంట్రాక్టర్స్‌కు పది బాగాలు చేసి ఇచ్చేవారు. ఎవరికి వారు పదిహేనో, ఇరవయ్యో శాతం లాభం వేసుకొని పని చేసేవారు. కానీ వీళ్ళ పాలన వచ్చాకా వేల కోట్ల విలువ చేసే పనిని కూడా ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ చివరకు వచ్చే సరికి ఆ పని ఏ ఐదో కాంట్రాక్టరో సబ్‌కు తీసుకొని చేస్తున్నాడు. దాని ప్రకారం లెక్క వేస్తే, కనీసం మూడో వాడు సబ్ చేసినా పని విలువ నలబై ఐదు నుండి అరవై శాతం అంచనా పెరగడమో, లేదూ అంటే అంత శాతం నాణ్యత తగ్గడమో జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న IVRCL, NCC, RAMKY, MADHUCON లాంటివి అప్పుడు పురుడుపోసుకున్నవే. వీళ్ళు కూడా వర్క్‌ని సబ్‌ కాంట్రాక్ట్‌కే ఇస్తున్నారు, అలా మూడు నాలుగు చేతులు మారుతోంది. ఈ వ్యవస్థ నశించాలి, పని తక్కువ ఖర్చుతో నాణ్యతతో పూర్తవ్వాలంటే, పూర్వంలా చిన్న కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. బిజెపి వాళ్ళ మొదటి మానిఫెస్టోలో ఉప్పు తయారుచెయ్యడానికి మల్టీ నేషనల్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పుకున్నారు. ఆ తరువాత జరిగింది మనం చూసిందే. ఇప్పుడు దేశంలో ఉన్న కన్‌స్ట్రక్షన్ పనులన్నీ కూడా పాతిక, ముపై కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. ఆ వట వృక్షాల ముందు చిన్న కంపెనీలు బ్రతకలేకపోతున్నాయి. ఇలా ప్రతీ వ్యవస్థ కూడా పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆఖరుకు రక్షణ వ్యవస్థ కూడా. దీనిని మోడీ ఏమన్నా మారుస్తాడేమో చూడాలి.