ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, May 24, 2014

మొన్న రాత్రి CNN-IBN లో అనుకుంటా, కర్ణాటకు చెందిన జ్ఞానపీఠ్ (?) అవార్డు గ్రహీత, మోడీ ప్రధాని అయితే దేశం విడిచి వెళ్ళిపోతానన్న అనంతమూర్తి, మన దేశంలో స్త్రీలల్లో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేటట్టు నటించిన ఇద్దరు స్త్రీ మూర్తులలో ఒకరు, తను మైనారిటీ కాబట్టి తనకు ఎవరూ ఇల్లు అమ్మడం లేదు (తనకు తక్కువ డబ్బు ఇస్తే తను చేస్తుందో లేదో నాకు తెలియదు) అని వాపోయిన షబానా అజ్మీల మాటలు విన్నాకా నాకు అనిపించింది ఏమిటంటే, ఈ దేశంలో మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ మాత్రమే అని, వాళ్ళను చంపితే మాత్రమే వీళ్ళ హృదయాలు ద్రవించి నీరై పోతాయని, అదే మైనారిటీలుగా ఉన్న సిక్కులను, జైనులను కానీ, కాశ్మీరులో హిందువులను కానీ చంపితే వీళ్ళకు ఏమీ అనిపించదని.

అదే 1984లో డిల్లీలో మూడు వేల మంది సిక్కులను చంపేసినా, చంపిన వాళ్ళు కాంగ్రెస్ హిందువులు కాబట్టి వీళ్ళకు ఆ మారణకాండ కనిపించలేదని, హిందువులు అయినా, ఇక వేరే మతస్థులు ఎవరైనా కాంగ్రెస్, కమ్యూనిస్టుల వాళ్ళు అయ్యి మైనారిటీలను చంపినా అది తప్పు కాదని వీళ్ళు చెపుతున్నారు. అంతే కాదు, మన జ్ఞాన్ అనంతమూర్తి గారయితే ఇంకొక అడుగు ముందుకు వేసి, ఆ ఘోరాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను, నేను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను అని కూడా చెప్పాడు. ఇంతకీ అదే మాట అనుకుంటున్నారు, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదట, మోడీ గురించి ఆయన అన్నమాటట. పైగా అప్పుడు ఆయన ఆ వేదనలో ఉండి దేశం విడిచివెళ్ళిపోతానని అన్నడట కానీ, ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదట. మనమే ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నామంట.

మరి అంత జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానపీఠం మీద కూర్చున్నవాడు నోరు జారితే, మరుసటి రోజైనా నేను ఏదో వేదనలో ఉండి అన్నాను కానీ, నా మాతృభూమిని వదిలి నేను ఎందుకు వెళతాను అని సరి చేసుకోవాలి కదా. అలా చెయ్యకపోవడం ఆయన తప్పు కాదంట, మనం వెళ్ళిపొమ్మనడం మన తప్పంట. మనమేమీ ఊరికే వెళ్ళిపొమ్మనలేదు కదా, ఆయన జ్ఞానపీఠం మీద ఉన్నాడు కాబట్టి, కొద్దిగా అన్నా జ్ఞానాన్ని చూపిస్తాడని ఆయన మాట ఆయనకు గుర్తు చేసాము. దానికి మనల్ని తప్పు పడితే ఎలా? నాకు ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఏమన్నా తప్పు మాట్లాడామా?

1 comment:

  1. ఈ సూడో మేధావులతో వచ్చిన చిక్కే అది.

    ReplyDelete