ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Wednesday, May 14, 2014

నేను సివిల్ డిప్లొమా పూర్తి చేసింది 1981 లో అయినా, మా నాన్నగారు సివిల్ ఇంజనీరింగులో లెక్చరరే కాకుండా చార్టర్డ్ ఇంజనీరు కూడా కావడం వలన 1978 నుండీ నా ఫీల్డుతో నాకు పరిచయం ఉంది. ఆ అనుభవంతో చెపుతున్నాను.
మా ఫీల్డు ఎన్‌డియే, తెలుగుదేశం హయాం నుండి సర్వనాశనం అయ్యిపోయింది. అప్పటి దాకా ఒక పనిని పది మంది కాంట్రాక్టర్స్‌కు పది బాగాలు చేసి ఇచ్చేవారు. ఎవరికి వారు పదిహేనో, ఇరవయ్యో శాతం లాభం వేసుకొని పని చేసేవారు. కానీ వీళ్ళ పాలన వచ్చాకా వేల కోట్ల విలువ చేసే పనిని కూడా ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ చివరకు వచ్చే సరికి ఆ పని ఏ ఐదో కాంట్రాక్టరో సబ్‌కు తీసుకొని చేస్తున్నాడు. దాని ప్రకారం లెక్క వేస్తే, కనీసం మూడో వాడు సబ్ చేసినా పని విలువ నలబై ఐదు నుండి అరవై శాతం అంచనా పెరగడమో, లేదూ అంటే అంత శాతం నాణ్యత తగ్గడమో జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న IVRCL, NCC, RAMKY, MADHUCON లాంటివి అప్పుడు పురుడుపోసుకున్నవే. వీళ్ళు కూడా వర్క్‌ని సబ్‌ కాంట్రాక్ట్‌కే ఇస్తున్నారు, అలా మూడు నాలుగు చేతులు మారుతోంది. ఈ వ్యవస్థ నశించాలి, పని తక్కువ ఖర్చుతో నాణ్యతతో పూర్తవ్వాలంటే, పూర్వంలా చిన్న కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. బిజెపి వాళ్ళ మొదటి మానిఫెస్టోలో ఉప్పు తయారుచెయ్యడానికి మల్టీ నేషనల్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పుకున్నారు. ఆ తరువాత జరిగింది మనం చూసిందే. ఇప్పుడు దేశంలో ఉన్న కన్‌స్ట్రక్షన్ పనులన్నీ కూడా పాతిక, ముపై కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. ఆ వట వృక్షాల ముందు చిన్న కంపెనీలు బ్రతకలేకపోతున్నాయి. ఇలా ప్రతీ వ్యవస్థ కూడా పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆఖరుకు రక్షణ వ్యవస్థ కూడా. దీనిని మోడీ ఏమన్నా మారుస్తాడేమో చూడాలి.

No comments:

Post a Comment