ఇప్పుడు సోషన్ నెట్ వర్క్స్ని ప్రతీ పార్టీ వాడుకుంటోంది. మనం పెట్టే కొన్ని పొస్టులు, రాసే కొన్ని కామెంటులు కొంత మంది రాజకీయ నాయకులైనా అప్పుడప్పుడు చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం అభిమానించే పార్టీ / నాయకుడిలో మనకు తప్పు కనిపించినప్పుడు దానిని ఫేస్బుక్ / ట్విట్టర్ల ద్వారా చెపితే సరిదిద్దుకోవడానికి (సరిదిద్దుకోరు అనేది అందరికీ తెలుసు, కానీ ఎక్కడైనా కొద్దిగా పలచటి చర్మం ఉన్నవాడు ఉంటే వాడికోసం) అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. అంతే కానీ నా పార్టీ గంగలాంటిది, నా నాయకుడు అపర భగీరధుడు అని చెప్పడం వలన ఉపయోగం కంటే అపకారమే ఎక్కువ జరుగుతుంది. మన దేశంలో అన్ని వ్యవస్థలను మన రాజకీయనాయకులు నిర్వీర్యం చేసేసారు. కాబట్టి వాళ్ళను అదుపు చెయ్యగలిగేది మనమే.
నా అంచనా ప్రకారం
అతి తొందరలో మన దేశంలో అంతర్యుద్ధాలు మొదలవుతాయి. అవి మొదలు కాకుండా ఉండాలంటే మనమే మేలుకోవాలి. మన దేశంలో ఏ వ్యవస్థా ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు.ఇప్పుడు, నిరక్ష్యరాశ్యులయిన రాజకీయనాయకుల కంటే విద్యావేత్తలయిన రాజకీయనాయకులే ఎక్కువగా మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయంలో విద్య అపాత్ర దానం కాకూడదు అని మనువు చెప్పిన వాస్తవాన్ని అందరం ఒప్పుకోవలసిందే.