ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, January 3, 2015


ఇది నేను ఎవరినీ తప్పు పడుతూ రాస్తున్నది కాదు, కాని అంటరానితనం అనేది దేవుడు సృష్టిస్తే వచ్చిందో, లేక మనువు రాస్తే వచ్చిందే కాదు అని అనిపిస్తోంది. ముఖ్యంగా సామాన్యుడికి పరిపాలనా పరంగా జరుగుతున్న అన్యాయాలు గమనిస్తుంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్న రాజకీయపార్టీలు, దాని అభిమానులూ కొన్ని దశాభ్దాలో, శతాభ్దాలో గడిచేసరికి అంటరాని కులంగా మారిపోతారు అనిపిస్తోంది. అనిపించడం ఏమిటీ, నేను రాజకీయకులాన్ని ఎప్పటినుండో అంటరాని వాళ్ళుగానే చూస్తున్నాను.

సామాన్యుడి భూమిని, అతని అంగీకారం లేకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అనే ఈ ఆర్డినెన్స్ ఒక్కటి చాలు, సామాన్యుడి శవాల గుట్టలు పేరుకుపోవడానికి. ఎప్పుడో హిందువులను ఊచకోతకు గుర్తుగా దేశ సరిహద్దుల్లో ఏర్పడిన హిందూ కుష్ పర్వతాలలాంటివే, ఇప్పుడు ప్రతీ జిల్లాలోనూ రైతు కుష్ పర్వతాలు ఏర్పడతయేమో.

అభివృద్ధి అంటే అందరూ బాగుండడం, కొందరే బాగుపడడం కాదు. ఒకప్పుడు నేను దేవుడు పాదయాత్రలో చూసింది పంటపొలాలు కానీ, సామాన్యుల వెతలు కాదు అని ఉక్రోసంతో అరిచాను. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. అక్కడ మోడీ అయినా, ఇక్కడ బాబు అయినా దానికి అభిమానులం మనం వత్తాసు పలకడం ద్వారా చేస్తున్నది అదే.

హత్యలు చేసేవాడికీ, మానభంగాలు చేసేవాడికి వాడి రీజనింగ్ వాడికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెపుతున్న రీజన్స్ కూడా అవే. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యావరణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయి, రక రకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు అని వాపోయేవాడు. ఇప్పుడు ప్రధాని అవ్వగానే తన కోరిక తీర్చుకుంటున్నాడు. అదే ప్రకృతిలో కొద్దికాలం సన్యాసాశ్రమం స్వీకరించి గడిపిన అనుభవం ఉండీ, ఈ రోజు అదే ప్రకృతిని నాశనం చెయ్యాలని అనుకోవడం, చాయ్ అమ్ముకునేవాడిని, నేను పెద్ద పెద్ద పనులు చెయ్యను, సామాన్యుడికి కావలసిన చిన్న చిన్న పనులే చేస్తాను అని అంతర్జాతీయ వేదికల మీదా తన వాగ్ధాటిని ప్రదర్శించి, ఇప్పుడు ఆ చిన్న చిన్న పనులే చేసి సామాన్యుడి ఉసురు తీస్తున్నాడు.

ఇక ఈ దేశ అదృష్టం బాగుండి, బాబు ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు కాబట్టి సరిపోయింది కానీ, అదే ప్రధాని అయ్యుంటే, కొత్త రాజధాని అని చెప్పి, మన ఉమ్మడి రాష్ట్ర విస్తీర్ణం అంత భూమిని లాక్కునేవాడేమో.

కలియుగం అంటే ఇదే. ఇపుడు ఉసురు తగలడాలు, నాశనం అవ్వడాలు ఉండవు అనుకుందామంటే, కొన్ని చూసాము కాబట్టి, ఉంటాయి అని కొద్దిగా నమ్మకం కలుగుతోంది. అవి చూసాకా కూడా వీళ్ళకు బుద్ధి రావడం లేదంటే, వీళ్ళ వంశ నాశనాలు వీరే కొని తెచ్చుకుంటున్నట్టుంది.