ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, March 12, 2011

ఇది ఎవడబ్బ సొత్తు?

అసలు మన రాజకీయనాయకులు ఏమి అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఎవరి సొమ్ము, ఎవరు దానం చేస్తున్నారు? ఇప్పుడే కనుక శ్రీ శ్రీ బ్రతికుంటే, కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవిత కనర్హం అని కాకుండా అడవి చెక్కా, కొండ గుట్టా, సాగరతీరం కాదేదీ సెజ్‌ కనర్హం అని వ్రాసేవారేమో? 10 సంవత్సరాల క్రితం అడ్రస్ అంటూ లేని వాళ్ళు, ఈ రోజు బిజినెస్ మాగ్నట్‌లు. ఎవడైనా ఇండస్ట్రీ పెడతానంటే పాపం, వాడి వెనకాల మా రాష్ట్రంలో పెట్టు, మా రాష్ట్రంలో పెట్టు అని పరిగెడుతున్నారు. వాళ్ళకు ఇచ్చే సబ్సిడీలు చూస్తుంటే, వాడి కంపెనీలో ప్రొడక్షన్ లేకపోయినా పరవాలేదు అనిపిస్తోంది. సాగరతీరం..సంద్యాసమయం అనే పాటకి ఇప్పుడు రక్తమయం అని కలుపుకుని పాడుకునే రోజులు వచ్చాయి

అందులో మన రాష్ట్ర పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సరే ఇవన్నీ నడిస్తే, ఒక 50 సంవత్సరాల పాటు కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళకి కారుచవగ్గా స్థలాలు ఇవ్వడం ఏమిటో అర్ధం కావడంలేదు. పోనీ వాడేమైనా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అమ్ముతాడా అంటే, అన్నీ కూడా చదరపు అడుగు 2500-4000 వరకు విలువచేసేవే. అంటే డబ్బున్న వాడికి డబ్బున్నవాడు కట్టి అమ్ముకోవడానికి, ప్రజల ఆస్తులు ధారపోస్తున్నారన్నమాట.

మొన్న జరిగిన మిలియన్ మార్చ్‌లో, ఎటువంటి రాజకీయప్రమేయంలేని మహానుభావుల విగ్రహాలు ధ్వంసం చేసేబదులు, ప్రజల ఆస్తులని సెజ్‌ల పేరు చెప్పి కొల్లగొడుతున్నవాళ్ళ కొంపలు కూలగొట్టి ఉంటే, మిగిలిన అసహాయులకి మార్గదర్శకులుగా మిగిలిపోయేవారు. వీరికి దేశమంతా జోహార్లు చెప్పేది. సి.బి.ఐ. కూడా ఆశ్చర్యపోయే రీతిలో మన రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే మనమేమో తెలంగాణా అని, సమైక్యాంధ్రా అని కొట్టుకు చస్తున్నాము. నిజంగా తెలంగాణా కావాలనుకొనే వాళ్ళు ముందు సెజ్‌లని నాశనం చెయ్యాలి. దేనికి ఎంత అవసరమో అంత భూమి మాత్రమే ఉంచి, మిగిలిన భూమి ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పిల్లలని రెచ్చగొడుతున్న ఈ నాయకులు, రేపు తెలంగాణా వచ్చాకా వాటాలు తీసుకొని ఆ సెజ్‌ల జోలికి వెళ్ళరు. ఈ రాజకీయ రాబందులు ఆంధ్రాలో అయినా, తెలంగాణాలో అయినా ఒకటే జాతి. వీళ్ళని ఇరగదీస్తే కానీ సామాన్యుడి ఆస్తులకి రక్షణ ఉండదు.

పాపం నా స్నేహితుడు గంజివరపు శ్రీనివాస్ పెళ్ళాం, పిల్లలని వదిలేసి అడవి బిడ్డల కోసమని చెట్టూ, పుట్టా కాగితాలు, కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు. వాటి వలన ఎంతవరకు ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు కానీ, అవి కాకుండా వాళ్ళకి తుపాకులు ఎలా కాల్చాలో చెపితే వెంటనే ఉపయోగం కనిపిస్తుంది. ప్రతి ఊరు, ప్రతి అడవి ఒక సోంపేట, ఒక కాకరాపల్లి, ఒక సింగూరు అవ్వవలసిందే. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉండవలసింది కారం డబ్బాలు కాదు, చేతి బాంబులు, గండ్ర గొడ్డల్లు.

జపానులో సునామీ, మరో 12 దేశాల్లో ప్రమాదహెచ్చరికలు. ఒక ప్రక్క అడవులు నరుక్కుంటూ వెళుతూ మనల్ని మనమే చంపేసుకుంటున్నాము. ఇప్పుడు, ఆ నష్టాన్ని సరిచెయ్యడానికి, కొన్ని లక్షల కోట్ల డాలర్లు కాంట్రాక్టర్‌ల చేతిలో పెట్టాలి. సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిన కాకినాడ హోప్ ఐలండ్‌ని ఇప్పుడు ఒక వ్యాపారవేత్త చేతిలో పెట్టారు. రేపు ఉప్పెన వస్తే కాకినాడ పరిస్థితి ఏమిటి?

యుగాంతానికి ఆకాశంలో జరిగే మార్పులేమిటో, వాటి వలన ఎంతవరకూ నష్టముందో తెలియదు కానీ, ప్రకృతిని నాశనం చేసి, మనం భూమి మీదే ఆ పరిస్థితులు సృష్టిస్తున్నాం.

6 comments:

  1. నీ ఆలోచనలు మరియు భావాలు లోకసత్తా పార్టీకి దగ్గరగా ఉన్నాయి. నావి కూడా. అందుకే నేను లోకసత్తాలో మెంబర్ని అయ్యాను. చేతనైన సహాయం చెయ్యవచ్చు. నువ్వుకూడా ఆలోచించు.
    ఆదిత్యమ్

    ReplyDelete
  2. నాకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదు.అలాగని నాలో సోషలిస్ట్ భావాలు ఉన్నాయి అనుకోకు. నేను పల్లకీ ఎక్కితే మొయ్యటాయనికి నలుగురు ఉండాలి, అందరూ పల్లకీ ఎక్కితే ఎలాగ అంటాను. కాకపోతే పల్లకీ మోసేవాడి హక్కు, వాటా ఎట్టిపరిస్థితుల్లోనూ వాడికే ఉండాలి అంటాను.

    ReplyDelete
  3. రామరాజు గారూ! 'మోసే వాడి హక్కు, వాటా -- వాడికే ఉండాలి' అంటే ఏమిటిఅర్ధం? మోసే హక్కా? పల్లకి ఎక్కే హక్కా? వివరణ ఇవ్వండి.

    ReplyDelete
  4. రామరాజు గారూ! మీకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం ఏమిటి? చాలా ఆశాభావం తోనూ,ఆవేశం తోనూ కూడా ఉన్నారు.అందుకే అడవి చెక్క, సాగర తీరం వగైరా అనగలిగారు, అరవగలిగారు. అలాగే కానివ్వండి. ప్రజాస్వామ్యవాదులంటే, దోచుకునే వాళ్ళు, వాళ్ళ తొత్తులు కాదండీ!అలాంటి వాళ్ళని ఇరగదీసే వాళ్ళు, ఇరగదీయించే వాళ్ళు అసలైన ప్రజాస్వామ్య అభిమానులు.
    gksraja.blogspot.com

    ReplyDelete
  5. Ramaraju gaaru.. I understand your agony, Yes there is meaning.Papam Srini...

    ReplyDelete
  6. GKS Raja గారూ, నా దృష్టిలో ఎవరి పని వాళ్ళు చేయాలి. పల్లకీ మోసేవాడు పల్లకీ మోయాలి, ఎక్కేవాడు ఎక్కాలి. అయితే ఇక్కడ జరుగుతున్నది మనం పల్లకీ ఎక్కగానే మోసేవాళ్ళు బానిసలు అనుకుంటున్నాము. దానిని నేను ఒప్పుకోను. నేను ఉద్యోగం చేసే సమయంలో చాలా సార్లు ఇలాంటి ప్రవర్తన చూసాను. ఆఫీసర్ ఇంటికి ఇల్లు మారినప్పుడల్లా డిస్టెంపర్ వేయించితే, ఒక వర్కర్ ఇంటిలో పెళ్ళికి మామూలు సున్నం వెయ్యడానికి అతను శుభలేక ఎటాచ్ చేస్తే కానీ వేసేవాళ్ళము. దానిని నేను ప్రశ్నించేవాడిని. ఎవరి హక్కులు వాళ్ళకు ఉండాలి. అది నా భావన.

    ReplyDelete