ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, February 21, 2015

నేటి భారతం.



నేను ఒక అరగంట క్రితం ఇంటికి వచ్చే సరికి ఈటీవి 2 లో వక్తలు మాట్లాడుతున్నారు. జపాన్‌లో అలా ఉంటారు, ఇలా ఉంటారు అని. బాగానే ఉంది. దానిని ఎవరూ కాదనరు. అక్కడ వర్క్ కల్చర్ కూడా వేరేగా ఉంటుంది అనేది, గొడ్లు కాసుకునే వాడికి కూడా తెలుసు. జపాన్ అయినా, సింగపూర్ అయినా అలా ఉండడానికి కారణం రాజకీయ అవినీతిని అక్కడ ఉపేక్షించకపోవడం.


దానిని ప్రక్కన పెట్టినా, ఇప్పుడు మన రాష్టంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఎన్ని చదువును చెప్పేవి ఉన్నాయి? ఆ కాలేజీలకు ఎవరు అనుమతిచ్చారు? అటువంటి కాలేజీల నుండి వచ్చినవారి దగ్గర నుండి నువ్వు ఏమి పొందగలవు? ఏదో ఎంసెట్‌లో సీట్ వచ్చిన వాడే మేధావి అని అనుకోవడం పొరపాటు. లక్ష ర్యాంక్ వచ్చిన వాడు కూడా మంచి ఉపాధ్యాయులు ఉంటే, ఒక మంచి ఇంజనీర్ కాగలడు. కానీ జరుగుతున్నది ఏమిటి? వీళ్ళు జపాన్‌లు, సింగపూర్‌లు వెళ్ళక్కరలేదు. మన దగ్గర ఉన్న పారిశ్రామిక వేత్తలను అడిగినా చెపుతారు, వచ్చేదంతా స్క్రాప్ అని. దానికి కారణం ఈ నాయకులు కాదా? అలాగే పరిశ్రమ అధిపతులు కూడా ఓహో జపాన్ అంటున్నారు. నిజమే ఓహో జపానే. కానీ అక్కడ పరిశ్రమల అధిపతులు వీళ్ళల్లాగా కాపీ కొట్టరు, రీసెర్చ్ మీద ఖర్చుపెడతారు. శ్రామికుడి శ్రమ శక్తిని దోచుకోరు.



పైగా వాళ్ళు మాటల్లో మనలో ప్రతీ దానినీ వ్యతిరేకించే భావన పోవాలని సుద్దులు కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఎటువంటి విత్తనాలు వేసినా మనం మాట్లాడకూడదన్నమాట. చెప్పేవాడికి వినే వాడు లోకువ అని ఊరికే అనలేదు. ముందు విద్యా వ్యవస్థని ప్రక్షాళన కావించాలి. ఆ ధైర్యం మన ప్రభుత్వాలకు ఉందా? ఎవడన్నా, పక్కోడిని చూసి అలా ఎదగడానికి చూస్తాడు కానీ, పక్కోడు గొప్ప, మనం ఉట్టి సోంబేరిలం అని అనడు. అధికారం ఉంది కదా, అలా ఎదగడానికి ప్రణాళికలు తయారుచెయ్యండి, ఇక్కడ తెలివితేటలకు లోటు లేదు, దరిద్రం అంతా, మీ ధనాపేక్ష ఒక్కటే

No comments:

Post a Comment