ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, December 17, 2010

ఈ దేశ భవిష్యత్తు తీర్చి దిద్దిన త్రిమూర్తులు.


చాలా క్లిష్ట మైన సమయం లో ప్రధాన మంత్రి భాద్యతలు స్వీకరించిన శ్రీ.చంద్ర శేఖర్ తప్పని పరిస్థితుల్లో మన బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు దేశం అంటా గగ్గోలు పెట్టింది.(అదే మన మాన్యులు మన్ మోషం సింగ్ గారు న్యూక్లియర్ డీల్ టైం లో మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడు శ్రీ. అబ్దుల్ కలాం గారు కూడా సపోర్ట్ చేసారు). ఆ రోజు ఆయన చేసింది సామాన్యుడిని నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తల అమ్ముకోవడం కంటే బంగారాన్ని అమ్ముకోవడం మంచిది, అని నాకు లాంటి అసమర్దుల భావన.. ఇప్పుడు చాలా మంది ఆ రోజు ఆయన చేసింది కరెక్ట్ అంటున్నారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయి హాయిగా పుస్తక రచనలు చేసుకుందాము అని బయలుదేరిన మన శ్రీ. పి.వి.నరసింహ రావు గారు ప్రధాన మంత్రి కావడం, (విశ్వాస ఘాతుకానికి గురి అవ్వడం మనకందరికీ తెలిసిన చరిత్రే), తరువాత శ్రీ. వాజ్ పాయి గారు ప్రధాన మంత్రి కావడం అనేవి చాలా కాకతాళీయం గా జరిగి ఉండవచ్చు. కానీ ఈ వరుస తప్పి వుంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో?

No comments:

Post a Comment