ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, December 18, 2010

సహజంగా ఎటువంటి రాక్షషుడు అయినా జనాల బాధకి కొంత కరుగుతాడు, కానీ మన వై.ఎస్.ఆర్. దేముడు కదా

సహజంగా ఎటువంటి రాక్షషుడు అయినా జనాల బాధకి కొంత కరుగుతాడు, కానీ మన వై.ఎస్.ఆర్. దేముడు కదా.........అతను పాదయాత్ర చేసి ముఖ్య మంత్రి అయ్యాడు కాబట్టి ఆ యాత్రలో జనాల కస్టాలు చూసివుంటాడు ప్రజలకు చాలా మేలు చేస్తాడు అనుకున్నాను. అతను దేశ కోడలు సోనియా ను పోగుడుతున్నప్పుడల్లా ఇదేంటి ఇతని వలన కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది, ఇతను వాళ్ళ కాళ్ళు పట్టుకున్తున్నాడు ఏమిటి అనుకొనేవాడిని. కానీ అతను యాత్ర లో ప్రజల కష్టాలు చూడలేదు వాళ్ళ పొలాలు చూసాడు అని తరువాత తెలిసింది. రెండు పంటలు పండే పచ్చటి పొలాలు సెజ్ ల పాలు అయ్యిపోయాయి. అందరూ వై.ఎస్.ఆర్. వుంటే తెలంగాణా గొడవ వుండేది కాదు, అనుకుంటున్నారు, అసలు అతని వలనే అది పెద్దది అయ్యింది. వేల ఎకరాలు సెజ్ ల పేరు చెప్పి దోచుకుంటుంటే ఇక్కడి వాళ్లకి కడుపు మండదా? నక్సలైట్స్ ని అనిచేసాడు అంటున్నారు, నిజమే కానీ మనిషిలో నక్సల్ భావాలు చాలా పెరిగాయి. నిజంగా అతను ఉండుంటే భూములు కోల్పోయిన రైతులు అందరూ నక్సలైట్స్ గా మారేవారు. దేముడనే వాడు వున్నాడు కాబట్టే రచ్చబండ కార్యక్రమం జరగకుండా ఆపేడు, లేక పొతే వీళ్ళ దాహానికి ఇంక ఎన్ని వేల ఎకరాలు పోయేవో, ఎంత మంది రైతులు కూలీలుగా మారేవారో. థాంక్స్ వరుణదేవా....

No comments:

Post a Comment