ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, December 26, 2010

నాధూరాం గోడ్సే ని విమర్శించడం ఒక ఫేషన్ అయ్యిపోయింది.

http://timesofindia.indiatimes.com/city/mumbai/Godse-reference-stirs-up-hornets-nest-at-Thane-lit-fest/articleshow/7165552.cms

మన దేశంలో ప్రతిఒక్కరికి నాధూరాం గోడ్సే ని విమర్శించడం ఒక ఫేషన్ అయ్యిపోయింది. అతని దేశ భక్తిని శంకించే అర్హత ఈ కుహనా లౌకికవాదులకు ఇంకో వొంద జన్మలెత్తినా రాదు. ఆ రోజు అతను గనుక గాంధీ ని చంపకపోయి వుంటే మన దేశం ఇంకో వొంద ముక్కలయ్యేది. దురదృష్టవశాత్తు మన దేశానికి తొలి ప్రధానమంత్రి నెహ్రు అవ్వడం వలన అతను కోర్టు లో చేసిన వాదన ప్రతులను బయటకు రాకుండా నిషేధం విధించారు. చాలా కాలం తరువాత ఆ నిషేధం ఎత్తివేసాకా దానిని ప్రచురించినా అది ఎక్కువమందికి అందుబాటు లోకి రాలేదు. ఈ దేశంలో దానిని ఒక సీరియల్ గా ప్రచురించే దైర్యం ఏ ఒక్క పత్రికాధిపతికి లేదు. ఎందుకంటే అది ప్రచురిస్తే వాళ్ళ మీద  హిందూ మతతత్వ వాది అనే ముద్రపడిపోతుంది. ఈ దేశంలో మేధావులందరూ గుడ్డలిప్పుకొని తిరగడానికి సిగ్గుపడరు కానీ, నేను హిందువుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. గోడ్సేని తిట్టేముందు అసలు అతని వాదనని ఎంతమంది చదివారు. చదవడానికి ఈ పుస్తకం బయట అమ్మే దైర్యం ఎవరికి వుంది? ఈ పుస్తకం కావాలంటే మనం ఏ ఆర్.ఎస్.ఎస్. ఆఫీస్ కో వెళ్ళాలి. సాని వాడకు వెళ్ళాలంటే లేని భయ్యం అక్కడకు వెళ్ళాలంటే వచ్చేస్తుంది.

అతని మరణ వాంగ్మూలం లో అతను చెప్పినదానిని చదివితే అతను ఎంత దేశభక్తి కలవాడో అర్ధం అవుతుంది. అతని పుస్తకం చదివితే ఎక్కడా ప్రపంచమంతా కొలిసే గాంధి నిజ స్వరూపం బయటపడుతుందో అనే భయం తో గాంధి పేరు చెప్పుకొని అడుక్కునే కాంగ్రెస్ వాళ్ళ భయం. ఒక్క కాంగ్రెస్ వాళ్ళే కాదు, బి.జే.పి. వాళ్లకి కూడా అతను చేసింది కరెక్ట్ అని చెప్పే ధైర్యం లేదు.

జైలు లో వుండగా అతను సంపాదించిన దానిలో సగభాగం సోమనాధ దేవాలయ కలశ స్తాపనకి ఇచ్చి, మిగిలిన సగభాగం తన సోదరులకు తన అంత్య క్రియలకి అయ్యే ఖర్చు నిమిత్తం ఇస్తూ, అతను వాళ్ళని ఒకటే అడిగాడు. నా అంత్య క్రియలు మీకు ఎలా వీలైతే అలా చెయ్యండి, కానీ నా చితాభస్మం మాత్రం భారతదేశపు ఏ నది ఒడ్డున కూర్చుని ఋషులు వేదాలు గానం చేసారో ఆ నది తిరిగి నా దేశపు సరిహద్దుగా వచ్చాక మాత్రమే అందులో కలపండి. అది మీ తరం లో సాధ్యపడక పొతే, దానిని అలాగే వుంచేయండి. ఆ పని భావితరాల వాళ్లైనా చేస్తారు అన్నాడు. ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమికావాలి అతని దేశ భక్తి గురించి చెప్పడానికి.

ఇతని తమ్ముడు గోపాల్ గాడ్సే తో ఇంటర్వ్యూ 80s లో ఒకసారి ఉదయం పేపర్ లో ఇచ్చారు. అతను అప్పుడు ఒకటే అన్నాడు. ఈ బి.జే.పి. వాళ్ళు మసీదులు, చర్చిలు అంటారేమిటి, మనకు కావాల్సింది అఖండ భారత్ దాని గురించి పోరాటం చెయ్యమనండి అని.

No comments:

Post a Comment