ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, January 28, 2011

నేనూ, నా హిందూ మతం - 2

నేను హైదరాబాదు వచ్చినవెంటనే నాంపల్లి మసీదు కి వెళ్ళాను. ఇప్పటికీ, అప్పుడప్పుడు అత్తాపూర్ దర్గాకి వెళుతుంటాను. మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళేటప్పుడు, యానాం లో ఉన్న చర్చికి వెళతాను. ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే చెట్టూ,పుట్టల్లో కూడా దైవాన్ని చూసే మేము దేవుళ్ళందరూ ఒకటే అని నమ్ముతాము. ఇక్కడ నా వ్యతిరేకత మభ్యపెట్టడం మీద, మా మతాన్ని కించపరచడం మీద.

నేను, జిల్లాపరిషత్ జాబ్ చేసేటప్పుడు ఒక వార్డ్ మెంబర్ కలిసాడు. చాలా మంచివాడు. NREP ప్రోగ్రాం కింద వాళ్ళ ఊరిలో కాలనీ కట్టిస్తున్నాము. దానికి అతను వార్డ్ మెంబర్. ఒకరోజు మాటల్లో అతనిని కన్న తల్లి లాంటి మతాన్ని ఎలా వదలగలిగావు అని అడిగితే, అతను అతని చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి జరిగిన అవమానం గురించి చెప్పి, మీరైతే ఏమి చేస్తారు అని అడిగాడు. అతను చెప్పింది విని నాకు చాలా భాద అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ మతం మారడంవలన, వాళ్ళు నిన్ను గౌరవించారా అని అడిగా. లేదన్నాడు. అంటే నువ్వు వాళ్ళ మీద తిరగబడకుండా పారిపోయావు. దాని వలన నీకు జరిగిన అవమానం అలాగే వుంది కదా అన్నాను. పోనీ, ఈ రోజు అన్ని కులాలనుండి మతం మారుతున్నారు కదా, నీ పిల్లల్ని అలా మారిన అగ్ర కులస్తుడు వాళ్ళ పిల్లలకిచ్చి పెళ్ళి చేస్తాడా అన్నాను. లేదు అన్నాడు. మతం మారినంత మాత్రాన బుద్ది మారదుకదా, మారవలసింది మన అలోచనా విధానం, అది మారనంత కాలం మనం ఏ మతంలోకి వెల్లినా ఒకటే అన్నాను.

వీళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు నీ మతమునందు కించబరచబడుతున్నావు, మా ప్రభువు నందు అందరునూ సమానులే అంటారు. అవమాన బాధతో వున్న మనిషి అది నమ్ముతాడు. అప్పుడు మొదలుపెడతారు విషం నింపడం. వాళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటే పరవాలేదు. హిందూ మతాన్ని కించపరుస్తారు. ఎందుకంటే అలా చేస్తే తప్పితే వాళ్ళ మాట వినరు కదా. సంస్కారంలో తేడా చూడండి. ఒక సారి నా ఫ్రెండ్ తో వాదనలో వాడు ఉన్నట్టుండి, మీ విష్ణుమూర్తి నీటి అడుగున ఎందుకు ఉంటాడు అన్నాడు, నాకు వెంటనే అర్దం అయ్యి, ఏరా, మీ చర్చిలో మీ ప్రభువు గురించి కంటే కూడా మా గురించే, ఎక్కువ చెపుతారా అని అడిగా. ఎందుకంటే వాడు  ఏసు గురించి మాట్లాడడం కంటే హిందూ మతం గురించి కామెంట్ చెయ్యడమే ఎక్కువ చేస్తాడు. నేను వాడితో వ్యతిరేక భావన లోంచి పుట్టిన మతాలు అంత కంటే ఎక్కువ ఏమి చెపుతాయిలే అన్నాను. ఎందుకంటే హిందూ మతం మీద వ్యతిరేకతతోనె వాటి బ్రతుకు ఆధారపడిఉంది. దమ్మున్న వస్తువుకి పబ్లిసిటీ అవసరం లేదు కదా. నీమీద నీకు నమ్మకం లేనప్పుడే నువ్వు అవతలవాడి మీద చెడు చెపుతావు. 


సంస్కారమంటే ఎలావుంటుందంటే, ఒక‌సారి ఏదో మాటల్లో, మా మణుగూరు రామాలయం పూజారి గారితో మా వాదన విషయం చెప్పాను. ఆయన, వెంటనే మీరు వాళ్ళతో వాదించడం అనవసరం, ఎవరి నమ్మకాలు వారివి. వాళ్ళ దారిలో వాళ్ళని వెల్లనియ్యడమే అన్నారు. నేను ఆయనతో అలా కాదు, వీళ్ళు జనాల్ని మభ్యపెట్టి మతాలు మార్పిస్తున్నారు, దీనిని మనం ఆపాలి అన్నాను. ఆయన ఆ అవసరమేమిటి, వెళ్ళేవాళ్ళు వెలతారు, వచ్చేవాళ్ళు వస్తారు దానిని మనం ఆపకూడదు అన్నారు. తరువాత, ఆయన, ఆయన ప్రక్కనున్న తాళం కప్ప చూపించి రాజుగారు, మీరు దీనినే దేవుడు అనుకొని మనస్పూర్తిగా ద్యానం చేసుకోండి, మీరు అనుకున్న పని అవ్వకపోతే నన్ను అడగండి అన్నారు. అని ఇక్కడ మీకు కావలసింది దైవం మీద నమ్మకం అంతే అన్నారు. ఆయన ఎంత సెక్యులరిస్ట్ అంటే, ఆ గుల్లో పనిచేసే తోటమాలి క్రీస్టియన్. వాడు, వాడి ఇంట్లో పదిమందిని పిలిచి ఏసు ప్రార్దనలు చేయించేవాడంట. వాడు ఉండేది మా గుడిలోనే ఉన్న క్వార్టర్‌లో. ఆ విషయం ఈయన ఏ రోజూ మాకు చెప్పలేదు. కానీ, ఒకసారి వాడు మా గుడి హాల్లోనే ప్రార్దనలు పెట్టేడు. అప్పుడు ఆయన వాడిని తిట్టి మాకు చెప్పారు. మేము ఈ విషయం మాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అని దెబ్బలాడితే, వాడింట్లో వాడు, వాడి దేముడిని ప్రార్దించుకోవడం తప్పు కాదు కాబట్టి నేను మీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు వాడు లిమిట్ దాటాడు కాబట్టి చెప్పాను అన్నారు. అదీ దేముడ్ని నమ్మడమంటే. అదీ సంస్కారమంటే. అసలు గుడిలో ప్రార్దన చెయ్యడానికి వచ్చిన ఫాదర్‌ని అనాలి. కానీ సంస్కార హీనులని ఏమీ అని ఉపయోగం లేదు.
 

No comments:

Post a Comment