ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Wednesday, January 12, 2011

ఎంతైనా రాజు రాజే.......

108 సర్వీస్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. రామలింగ రాజు, ఎవరి గురించి ఎవరిని మోసం చేసారో తెలియదు, కానీ ఆయన జైలు కెల్లడం వలన ఆయన మొదలుపెట్టిన చాలా సేవా కార్యక్రమాలు నెమ్మదించాయి. బైర్రాజు ఫౌండేషన్ కార్యక్రమాలు మాత్రం నడుస్తున్నాయి. అందరికీ దాన గుణం ఉండదు. అది కొందరికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 108 సర్వీస్ లు నడుపుతున్నవాళ్ళు రామలింగరాజు కంటే ధనవంతులు. అది వాళ్ళ చేతుల్లోకి వెల్లినదగ్గర నుండి దాని మీద ఎన్ని గొడవలు నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము.

ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. నేను ఒక సారి నా చెరువులు మీద లోన్ తీసుకుందామని బేంక్ కి వెళ్లాను. మేనేజర్ ఏమేమి కావాలో అన్నీ చెప్పి, ష్యూరిటి సంతకం ఒకళ్ళు పెట్టాలి అన్నారు. అదేమిటి నా భూమి గవర్నమెంట్ లెక్కల ప్రకారమే లక్ష, మార్కెట్ రేటు మూడు లక్షలు, మీరు నాకు ఇచ్చేది 38,000/- అసలు నేను, నా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెడతానికి నేను మిమ్మల్ని ష్యూరిటి అడగాలి, అటువంటిది నన్ను మీరు అడుగుతున్నారేమిటి అన్నాను. అప్పుడు ఆయన, రాజు గారు మీరు అన్నది నిజమే కానీ డబ్బులు పుచ్చుకున్నవాల్లల్లో కొందరికి తిరిగి ఇచ్చే అలవాటు ఉండదు. వాళ్ళు కట్టకపోతే మేము కోర్ట్ నోటీస్ ఇచ్చి, కోర్ట్ చుట్టూ తిరగడం కంటే, ఇలా చేసేమనుకోండి, మేము ఒక ఫోన్ చేస్తే ష్యూరిటి ఉన్నవాళ్ళే మీ వెనక పడతారు అని, మీరు కావాలంటే చూడండి, మాకు డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళల్లో ఎక్కువమంది కోటీశ్వరులే ఉంటారు అన్నారు.   

అది నిజమే. రామలింగ రాజు చేతిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచిన 108, తరువాత గవర్నమెంట్ ఫండింగ్ ఇంకా ఎక్కువ చేసినా, ఇప్పుడు సరిగ్గా నడవడం లేదు. అందరూ అనవచ్చు అవినీతి సొమ్ముతో నడిపేడు అని, అవినీతి సొమ్ముని ఎంతమంది ప్రజలకు ఖర్చుపెడుతున్నారు? నిజంగా అలా చేస్తే మనం చాలా సంతోషించవచ్చు. 108 చేతులు మారగానే, మొదటగా వాళ్ళు చేసిన పని దాని మీద ఉన్న సత్యం సింబల్ తీసేసి వీళ్ళది వేసుకోవడం. చాలా బాధ అనిపించింది. అది రామలింగ రాజు మానస పుత్రిక, సరిగ్గా చెప్పాలంటే ఆయన ......, వద్దు లెండి. అసలు అది తీసేసి వీళ్ళది వేసుకోవడానికి సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు వీళ్ళు నడుపుతున్నారు కనుక వీళ్ళది వేసుకోవచ్చు, కానీ పాత దానిని తీసివెయ్యడం గురించి నేను మాట్లాడేది. సరే వేసుకున్నారు, తరువాత అంతే బాగా నడపవచ్చు కదా, డబ్బుకి లోటు లేదు, పైగా ప్రభుత్వం దగ్గర నుండి మునపటి కంటే ఎక్కువే వస్తోంది. అందుకే అంటారు పెద్దలు నువ్వు ఎంత డబ్బున్నవాడివి అయినా అవ్వు నీలో దాన గుణం లేకపోతే నువ్వు భిక్షగాడితో సమానం అని. అందరికీ ఇచ్చే గుణం ఉండదు, అది పుట్టుకతోనే వస్తుంది.

No comments:

Post a Comment