ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, January 31, 2011

నేనూ, నా హిందూ మతం - 3

                  ప్రతీ హిందువూ కీ.శే. శ్రీ. పి.వి. నరసింహరావు గారికి ఋణపడి ఉన్నారు.

హిందువంత విశ్వాసఘాతకుడు ఎవరూ ఉండరేమో. ఎందుకంటే, మసీదు కూల్చివేతకు కారణం కీ.శే. శ్రీ. పి.వి.నరసింహారావు గారేనని చాలా మంది నమ్మకం. అటువంటి వ్యక్తి (సోనియాకు భయపడి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు) వర్ధంతి సందర్భంగా, హిందువు గురించే వున్నాము అని చెప్పుకొనే బి.జే.పి. వాళ్ళు, కనీసం గుర్తుకుతెచ్చుకోలేదు. ఆయన ప్రమేయం కూల్చివేతలో లేకపోయినప్పటికీ, ఆ నింద ఆయన మీద పడినందుకు, గత 400 సంవత్సరాలుగా కానిది, ఆయన హయాంలో అయినందుకు అయినా, వీళ్ళు ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవలసిన అవసరముంది కదా. పాపం, ఆయన భౌతికకాయానికి జరిగిన అవమానానికి కారణం, ఆయన మసీదు కూల్చివేతకు కారకుడవ్వడమేనని, ఆయనకే కాదు, దానికి కారకులయినవారందరికి ఇలాగే అవుతుందని మా ఫ్రెండ్ నాతో అనేవాడు. అప్పుడు నేను వాడితో, ఒరేయ్, అలా అయితే మీరందరూ ఆయన కాళ్ళకు దన్నాలు పెట్టాలి అన్నాను. వాడికి అర్ధం కాలేదు. ఎందుకురా అన్నాడు. ఒరే, ఒక్క మసీదు కూలగొడుతుంటే, ఏమీ చెయ్యనందుకే పాపం ఆయనకు ఇలా అయితే, కొన్నివేల దేవాలయాలు కూలగొట్టినందుకు, పాపం మీ బాబర్ ఆత్మ ఇంకెంత క్షోభ పడుతూ ఉండి ఉంటుందో, దానికి ఈయన వలన చివరికి మోక్షం దొరికివుంటుంది కాబట్టిరా అన్నాను. ఆ రోజు, పి.వి. గారిని ప్రక్కనపెట్టండి, ఒకవేళ అద్వానీ, వాజ్‌పాయ్‌లే గనుక అడ్డుకునుంటే, కరసేవకులు వాళ్ళని చంపేసుందురు అంట. అక్కడ వాళ్ళ ఉద్రేకం అలా ఉందంట. ఇది ఒక్క అద్వానీయో, జోషీయో చెపితే జరిగినది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ గుండెల్లో అణగద్రొక్కుకుంటూ వస్తున్న అవమాన భారం వీళ్ళ వలన బయటకువచ్చిందంతే.

జనవరి 26 న లాల్ చౌక్‌లో, జాతీయపతాకం ఎగురవెయ్యాలని బి.జె.పి. ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది కదా. దాని మీద చాలా మంది ముస్లింమేధావులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు కదా. బి.జె.పి ని ప్రక్కనపెట్టి, వీళ్ళే వెల్లి ఎగురవెయ్యవచ్చుకదా? అక్కడ ఉన్నది వీళ్ళ సోదరులే కదా. చెయ్యరు. నాకు ఎప్పటికీ అర్ధంకాని చిక్కుముడి ఒకటి ఉంది. అదేమిటంటే ప్రపంచంలో ఎక్కడవున్న హిందువైనా సరే భారతదేశం వంకే చూస్తాడు, ఎందుకంటే అతని మతానికి సంబందించిన మూలాలు ఇక్కడే వున్నాయి కనుక. అలాగే భారతదేశపు ముస్లిం సోదరులు మిడిల్ ఈస్ట్ వైపు చూస్తే అర్ధం ఉంది, వీళ్ళ మూలాలు అక్కడ ఉన్నాయి కనుక. కానీ వీళ్ళకు పాకిస్థాన్ మీద ప్రేమ ఎందుకో నాకు అర్ధం కాదు. బి.జె.పి లో ముస్లిం లీడర్ ఎవరైనా ఉంటే అతను షియానా, సున్నీనా అని అడుగుతారు. వీళ్ళకి దేశం మీద భాద్యత లేదా? కాశ్మీరు గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు. ఒకసారి షబానాఅజ్మీ తను మత వివక్షకు గురిఅయ్యానని మాట్లాడింది. రూపాయిని అర్దరూపాయికి అడిగితే ఎవడూ ఇవ్వడు. పోనీ తను తక్కువ ఇస్తే నటిస్తుందా? ఆవిడా, ఆవిడ భర్తా మేము మేధావులమి, సెక్యులరిస్ట్‌లమి అంటారు కదా వాళ్ళు కాశ్మీర్ వెళ్ళి మాట్లాడవచ్చుకదా. బి.జె.పి. వాళ్ళు వెలుతుంటే కొంతమంది వీళ్ళు అక్కడకు వెల్లాకా వీళ్ళ మీదకు సెపరేటిస్ట్ లను వదిలితే బాగుంటుంది అంటారు. అంటే, వేరే దేశం వాడు నీ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంటే నీకు బాధగా లేదా? వీళ్ళకు ఆ దేశం మీద ప్రేమ ఉంటే అక్కడకే వెళ్ళిపోవచ్చు కదా? వెళ్ళరు. ఎందుకంటే, ఒక్క ఈ దేశంలో మాత్రమే ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు. వాళ్ళకి వాళ్ళ పెర్సనల్ లా ప్రకారం నడవాలి, అది కూడా సివిల్ లా మాత్రమే, క్రిమినల్‌లా మళ్ళీ ఈ దేశానిదే కావాలి. అలా ఎందుకు? ఖురాన్ ప్రకారం ముస్లిం దొంగతనం చేస్తే చెయ్యి తీసేయడం, వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపండం చేయించుకోవచ్చు కదా, అప్పుడు ఎవరూ తప్పు పట్టరు. అది కుదరదు. ఒక్క భారతదేశ ప్రజాస్వామ్యంలో మాత్రమే ఈ వింత.

అసలు, మన నాయకులకి వీళ్ళంటే ఎంత భయమంటే, ఇజ్రాయిల్ ప్రక్కనున్న అరబ్ దేశాలు, ఏనాడో ఆ దేశంతో దౌత్యసంబందాలు పెట్టుకుంటే మన దేశానికి మాత్రం శ్రీ. పి.వి గారు వచ్చేదాకా దైర్యం చాల లేదు. అప్పుడు కూడా, దేశవ్యాప్తంగా జరిగిన గోల అందరము చూసాము కదా. ఇజ్రాయిల్ దాకా ఎందుకు, సంస్కృతంలో దూరదర్శన్‌లో వార్తలు పెట్టే దైర్యం కూడా లేదు.  ఇది అంతా మహానుభావుడు ఆ పి.వి గారి పుణ్యమే. హిందూ పార్టీ అని చెప్పుకొనే  బి.జె.పి. ఎట్టి పరిస్థితుల్లోను ఇవన్నీ చేసేదికాదు. అంటే ఈ దేశ బాహ్య, అంతర్గ్‌త విషయాలని వీళ్ళు ఎంత ప్రభావితం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి.

ఈ దేశంలో పార్శీలు, బౌద్దులు, సిక్కులు, జైనులు ఆఖరికి చైనా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన చైనీయులు అంతఃర్భాగంలా కలసిపోతుంటే వీళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారు? మొన్నా మద్యన వచ్చిన సచార్ కమిటీ రిపోర్ట్ చూడండి. వీళ్ళ వెనుకబాటుతనానికి ఎవరు కారణం? బీదరికం, చదువులేకపోవడం జనాభా పెరుగుదలకు ఒక ముఖ్య కారణం. బీదవాళ్ళకి పిల్లలు ఒక పెట్టుబడి సాధనం, అది హిందువు అయినా, ముస్లిం అయినా. పైగా వీళ్ళకి మత భావనలు నూరిపోసే మేధావులు ఉండనే ఉన్నారు. చెప్పేవాల్లు మాత్రం ఇద్దరితోనే ఆపేస్తారు.

1986-87 ల్లో అనుకుంటాను, ఒకసారి, మా జే.ఇ. నాతో, ఇంకో ఇరవై సంవత్సరాలలో ఇండియా ముస్లిం రాజ్యం అయిపోతుంది అన్నారు. వెంటనే నేను, అదే గనుకు జరిగితే మీతో మొదలుపెట్టి వంద మందిని చంపి నేను చస్తా అన్నాను. దానికి ఆయన రామరాజు, నువ్వు కోపం తెచ్చుకోకుండా ఆలోచించు మాలో ఆపరేషన్ చేయించుకుంటానికి మా లా ఒప్పుకోదు, అందుకనే నేను అలా అన్నాను అన్నారు. సార్, మీరు ముగ్గురితో ఆపేసారు కదా, అలాగే మిగిలిన వాళ్ళు కూడా కొద్దికాలానికి తెలుసుకుంటారు, ఎందుకంటే, పిల్లల్ని ఇచ్చేది దేముడైనా పోషిందేది మాత్రం మనమే కదా అన్నాను. అంతకు ముందు షాబానో కేస్ అప్పుడు కూడా ఆయన అలాగే అన్నారు. నేను ఆయన్ను, సార్ ఇక్కడ మతాన్ని ప్రక్కన పెట్టి మనషి లా అలోచించండి, ఆ వయసులో ఆవిడని పోషించవలసిన బాద్యత, భర్త మీద లేదా అని అడిగితే, ఆయన నువ్వు అన్నది నిజమే, కాదనను, కానీ మేము ఇప్పుడు దీనికి ఒప్పుకుంటే తరువాత మీరు, మమ్మలని మా శవాలు కప్పెట్టకూడదు, కాల్చండి అంటారు అన్నారు. నేను, సార్ మీరు పదిమందికి చెప్పవలసిన వాళ్ళు, మీరే ఇలా అంటే ఇంకేమి మాట్లాడతాము అన్నాను. 

నేను, మొన్న ఒక పెద్దాయన్ని కలిసాను. ఆయన, నాకు నమాజ్‌కి టైం అయ్యింది ముందు అక్కడకు వెళ్ళి వద్దాము అన్నారు. ఇద్దరం కలసి మసీదుకు వెల్లాము. నేను బయట నిలబడ్డాను. ఆయన నమాజ్ అయ్యాక, ఇద్దరం మళ్ళి బండి మీద వస్తుంటే, నేను, మీరు ప్రార్దనలో ఏమి చదువుతారు, దేముడ్ని పొగుడుతారా, లేక మాకులాగా వర్ణన తో కలిపి పొగుడుతారా అంటే, ఆయన మేము దేముడికి రూపం లేదనుకుంటాము కాబట్టి వర్ణన ఉండదు, ఇది మా పద్దతి అన్నారు. అంతే తప్పితే, మీరు చేసేది తప్పు అనలేదు. అది సంస్కారమంటే. నిజమైన ముస్లిం, హిందువు, క్రిష్టియన్ ఇంకెవరైనా సరే, నిజంగా వాళ్ళు దేముడిని నమ్మేటట్టైతే ఎప్పుడూ వేరే వాళ్ళ దేముల్లని కామెంట్ చెయ్యరు.

తెలంగణాకు హైదరాబాద్‌లో వున్న కొంతమంది ముస్లింలు వ్యతిరేకమంటున్నారు. ఎందుకు? ఇక్కడ ప్రతి వినాయకచవితికి, ఏమౌతుందో అని భయపడేది హిందువు కదా, మరి వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు? హిందువు అన్నవాడు ఎక్కడున్నా సెక్యులరే. అది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా. అందులో ఎవరూ ఎటువంటీ అనుమానాలు పెట్టుకోవక్కరలేదు. కాకపోతే ఇదివరకిటిలాగా ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఊరుకొనేపరిస్థితి మాత్రం కనిపించడంలేదు. అనవసరంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు హిందువుని రెచ్చగొడుతున్నారు. మొన్న దిగ్విజయ్ సింగ్, నిన్న వీరప్పమొయిలీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వీరప్పమొయిలీ దృష్టిలో RSS,BJP వాళ్ళ ప్రమేయముందని నిర్ధారన చేస్తేనే ఆ కమిటీ మాట నిజం, లేకపోతే అది అబద్దం. ఇటువంటి వాగుల్లు వాగే, వాళ్ళు గొడవలు జరిగేటట్టు చేస్తున్నారు. ఒక విధంగా అది హిందువుకి మేలు చేస్తున్నట్టే లెక్క. లేకపోతే హిందువులు కొంతమందైనా ఎప్పటికి ఏకమవ్వరు.

ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా పదిమందితో కలసి నడిచినంతకాలం ఏ గొడవలు ఉండవు. కాదు నాకు ప్రత్యేక గుర్తింపు కావాలి అన్నప్పుడే గొడవలు మొదలౌతాయి. క్రితం సంవత్సరం నేను టిఫిన్ చేద్దామని ఒక హోటల్‌కి వెళ్ళాను. అక్కడ, ఒక కుర్రవాడి ముందు ఈనాడు పేపర్ ఉంది, నేను అతన్ని పేపర్ అడిగితే, ఆ అబ్బాయి హిందీలో నాకు తెలుగు రాదు అన్నాడు. మీది ఏ స్టేట్ అని అడిగాను,  ఆ అబ్బాయి హైదరాబాదే అన్నాడు. అదేమిటి, ఇక్కడ వాడివి తెలుగు రాకపోవడమేమిటి అని అడిగితే, ఆ కుర్రవాడు నేను ముస్లిం‌ని అన్నాడు. ఏమి చదివావు అని అడిగితే డిగ్రీ అన్నాడు. నేను ఆ అబ్బాయితో, బాబూ నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాసి, నీకు మా కాకినాడలో ఉద్యోగం వచ్చిందనుకో, అక్కడ హిందీ మాట్లాడరు అప్పుడు ఏమి చేస్తావు, పైగా ఇది ఈ రాష్ట్ర భాష, నువ్వు IAS, IPS, Group 1 వ్రాసినా, ఇక్కడ ఉద్యోగం చెయ్యాలంటే లోకల్ భాష నేర్చుకోవాలి, భాషకి, మతానికి సంబందం లేదు అని చెప్పేసరికి, నిజమే అంకుల్, కాకపోతే మా దగ్గర తెలుగు మాట్లాడేవాల్లు లేకపోయేసరికి అది సరిగ్గా రాలేదు, ఈ మద్యనే మాట్లాడడం నేర్చుకుందామనుకుంటున్నాను అన్నాడు. మనం పిల్లల్లో కూడా ఇలాంటి భావజాలం నింపితే ఎలా?

ప్రతి మనిషీ, ఖచ్చితంగా తన మతాన్ని పాటించవలసిందే, అందులో ఎటువంటి మినహాయింపులు లేవు, కానీ ప్రక్క మతాన్ని కూడా గౌరవించవలసిందే. లేక పోతే ఇప్పుడు జరుగుతున్నట్టే గొడవలు ఎప్పటికీ జరుతూనేవుంటాయి. ఇంకా ఎక్కువగా. ఎందుకంటే, కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ మతం ఎప్పుడూ లేనిది, ఇప్పుడు తిరగబడడం నేర్చుకుంటోంది. ఇది ప్రస్తుతానికి కొద్దిగానే వుండవచ్చు, కానీ, పరిస్థితులు ఇలాగే ఉంటే, ఊచకోత కోయించుకోవడానికి అలవాటు పడిన హిందువు, ఊచకోతకోయడానికి సిద్దపడే స్థితికి వచ్చేసాడు. దయచేసి ఎవరు గొడవ చేసినా ఖండించండి. ఇందులో మత ప్రమేయాన్ని పెట్టకండి. ఈ దేశం మన అందరిదీ. మతభక్తి దేశ‌భక్తిని మింగకుండా చూడండి.

No comments:

Post a Comment