ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, January 9, 2011

మొన్న జై రాం రమేష్ గారు, నేడు సౌగత రాయ్ గారు

మొన్న జై రాం రమేష్ గారు, నేడు సౌగత రాయ్ గారు మార్కెట్ శక్తులు భారత దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో వెల్లడించారు. ఇవేమైనా మనం అర్థం చేసుకుంటున్నామా? వీటివలన మధ్యతరగతి, దిగువమద్యతరగతి ప్రజలు ఎలా నాశనం అవుతున్నారో అర్ధం చేసుకోండి.

ఈ రోజు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ కనిపిస్తోంది. ఒక పల్లెటూరిలో కూలిపని చేసుకొని, రోజుకు వంద రూపాయలు (అది కూడా పని దొరికిన రోజు మాత్రమే) సంపాదించుకొనే వ్యక్తి ఈ ఫోన్ వలన ఎలా నష్టపోతున్నాడో చూడండి. వాడు కూలి పని చేసి ఇంటికి వచ్చేసరికి వాడి దగ్గర వున్న ఫోన్ మోగుతుంది. పక్క నున్న చిన్న పట్టణం నుండి కాయిన్ బాక్స్ నుండి, వాడి స్నేహితుడు ఒరేయ్ కొత్త సినిమా వచ్చింది వెంటనే రమ్మంటాడు. వీడు తయారయ్యి షేర్ ఆటో ఎక్కి అక్కడకి వెళతాడు. ఇద్దరు కలసి చెరో క్వార్టర్ వేసి, సినిమా చూసి బిర్యాని తిని ఇళ్ళకు వెళ్ళిపోతారు. అంటే ఆ రోజు వాళ్ళ సంపాదన లో ఆటో కి 10, మందుకు 40, సినిమాకి 25, బిర్యానీకి 40 మొత్తం 115 రూపాయలు, మళ్ళీ వాళ్ళు ఇంటికెళ్ళి తాగిన మత్తులో పెళ్ళాం ని తన్నిన తాపులు. ఈ సెల్ ఫోన్ నిజంగా అవసరానికి ఉపయోగపడే దానికంటే కూడా వాడి జీవన విధానాన్ని నాశనం చెయ్యడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. అదే వీడికి ఈ ఫోన్ లేకపోతే ఉన్న ఊరిలో దొరికే పది రూపాయల కల్లు తాగి పడుకుంటాడు.

ఈ విషయం చదివిన మేధావులు ఒక ప్రశ్న అడగవచ్చు, వాడు ఫోన్ కొనుక్కోవడం తప్పా అని. కొనడం తప్పు అని ఎవరూ అనరు. కాకపొతే దానివలన జరిగే నష్టం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఇండియా టుడే వాళ్ళు ఒక కధనం వ్రాసారు. అందులో ఒక చేపల రైతు నాకు సెల్ ఫోన్ వచ్చాకా మార్కెట్ రేటు ని బట్టి నేను చేపలు పడుతున్నాను అని చెప్పినట్టు వ్రాసారు. ఎంత మూర్ఖత్వమంటే, చేపలు పట్టాలంటే పట్టుబడికి ముందు 4 రోజులు వాటికి మేత వేయరు, ఇక్కడ చేపలు పట్టాకా ఇక్కడ నుండి కలకత్తా వెల్లడానికి 3 రోజులు పడుతుంది. అంటే తక్కువలో తక్కువ గా 7 రోజులు. అప్పటికి ఆ రేట్ ఉంటుందా? వీడు రాసింది ఎలా వుందంటే, నాకు ఒరేయ్ ఈ రోజు రేట్ బాగుంది అని ఫోన్ రాగానే, నేను వెంటనే చిటికెలో చేపలు పట్టేసి, అర చిటికెలో మార్కెట్కి పంపేసి, లారీ తో డబ్బులు తెచ్చేసుకున్నట్టు గా ఉంది.

అంటే డెవలెప్మెంట్ వద్దని ఎవరూ అనరు. కానీ అది ఎంతవరకు అవసరం అనేది కూడా చూడాలి కదా. అంటే ఎవరు చూడాలి? ఇదొక ప్రశ్న. ఇదేమి నిత్యావసర వస్తువు కాదు, ఇంత చవగ్గా దొరకవలసిన పని లేదు. దీని రేటు ఎక్కువైతే నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళే కొనుక్కుంటారు. అందరిని చూడవలసిన భాద్యత ప్రభుత్వానిది కాదు అని మీరంటారు నాకు తెలుసు. నిజమే, మరి మనం కల్లుమూసుకుపోయి, షేర్ మార్కెట్ లో పెళ్ళాల తాళ్ళు కూడా తాకట్టుపెట్టి కనీస ఆలోచన లేకుండా 10 ని 500 పెట్టి కొని హర్షద్ మెహతా ల దెబ్బకి, ఖుదేలుమన్నప్పుడు మనం ప్రభుత్వాన్నే తిట్టాము. అంతో ఇంతో చదువుకున్న మనమే మనకి నష్టం వచ్చేసరికి ప్రభుత్వాన్ని తిడతాము కదా, మరి అదే భాద్యత ఒక సామాన్యుడి మీద కూడా ప్రభుత్వానికి వుండాలి కదా? ఈ సెజ్ ల పేరు చెప్పి ఎంతమంది రైతులు రైతు కూలీలుగా మారేరో మనం చదువుతూనే ఉన్నాము.  చాలా మంది నా మిత్రులు నాతో వాదించుతారు. వాళ్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువే వచ్చింది అని, నిజమే కావచ్చు కానీ వాళ్ళు దానిని అమ్ముకోకుండా వుంటే పది మందీ తిడతారన్న భయంతోనన్నా పండిన పంటలో ఇంట్లో తినడానికి 20 బస్తాల బియ్యం వుంచి మిగిలింది తాగేస్తాడు. ఇంట్లో వాళ్లకి కనీసం తినడానికి బియ్యం అన్నా ఉండేవి. కానీ ఇప్పుడు, వచ్చిన డబ్బులు ఏదో వ్యాపారం లో పెట్టి మునిగిపోయి, లేకపోతే తాగేసి నాశనం అయ్యిపోయి రోడ్డు మీద పడుతున్నారు.

అందుకనే మన పెద్దలు ఎవరికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే అందాలి అని అంటారు.

No comments:

Post a Comment