ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, January 14, 2011

తప్పు చేసేది మనమైతే, దానిని కృష్ణుడు మీదకి నేట్టడమేమిటి?

భవద్గీత లో లేనిది ఎందులోనూ లేదనే దానిని నేను గాడంగా నమ్ముతాను. కాకపొతే, దానిని మనం అర్థం చేసుకొనే దానిని బట్టి ఉంటుంది. చాలామంది కృష్ణుడు చెప్పిన చాతుర్వర్ణ వ్యవస్థ గురించి రక రకాలుగా విమర్శిస్తుంటారు. బ్రాహ్మనుడ్ని తలలో నుండి, క్షత్రియుడ్ని హృదయంలోనుండి, వైశ్యుడ్ని ఉదరము నుండి, శూద్రుడ్ని అరికాలిలోనుండి సృష్టించాడంట, మేము అంత నీచమా అంటుంటారు. అసలు కృష్ణుడు చెప్పిన వ్యవస్థ మానవ శరీరానికి అన్వయించి చెప్పాడు. మన శరీరంలో ఏ భాగం విలువలేనిది?  అలాగే ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సలహాలు ఇచ్చేవాడు, కాపుకాసేవాడు, కావలసిన వస్తువులు సమకూర్చేవాడు, ఆహారాన్ని పండించేవాడు కావాలి. ఇందులో ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ నాశనమే కదా. ఎవరి పని వాళ్ళు చెయ్యవలసినదే.

ఇదివరకు రిసెప్షనిస్ట్ అంటే, ఇప్పుడు ఫ్రంట్ ఆఫీసు ఎక్జిక్యూటివ్ అంటున్నాము, పని అదే, పేరు మాత్రమే తేడా. పేరు మారినంత మాత్రాన్న పని మారడం లేదు కదా, తల పని తలదే, చేతి పని చేతిదే. ప్రతి మనషి ప్రక్కవాడి మీద పెత్తనం చెయ్యాలి అనుకోవడం తోనే ఈ వైషమ్యాలు అన్నీ వచ్చాయి. ఈ రోజు చెప్పుల కొట్టులు అన్ని కులాల వారు పెడుతున్నారు, మనం వెళ్లి వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాము, అదే ఒక చెట్టు కింద చెప్పులుకుట్టుకొనే వాడిని వీడితో సమానంగా చూస్తున్నామా? ఇద్దరూ చేసేది ఒకటే, తేడా ఎక్కడుంది మన ఆలోచనలో. మనం నీచంగా ఆలోచిస్తూ దాన్ని కృష్ణుడి మీదకేందుకు తొయ్యడం. ఇక్కడ మనిషి లోనే తేడా ఉంది. ఈ మద్యన చాలా మంది మమ్మల్ని నీచంగా చూస్తున్నారు అని స్టేజ్ లెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. అసలు ఒకడు మిమ్మల్ని ఎలా చూసున్నాడు అనేది పక్కన పెట్టి, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో మొదటిగా ఆలోచించండి.

ఒక చిన్న ఉదాహరణ. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు, నేను వాదించుకుంటుంటే  మా పక్కన ఉన్నవాళ్ళు భయపడేవాళ్ళు. వాడు ఎప్పుడూ, మీరు మమ్మల్ని అనగదోక్కేసారు అనే వాడు. మాట్లాడితే మీ కృష్ణుడు ఇలా అన్నాడు, మనువు అలా అన్నాడు అనేవాడు. వాడి పెళ్లికెల్లేంత దాకా మాకెవరికి వాడు క్రీస్టియన్ అని తెలియదు. అప్పటిదాకా నాస్తికుడు అనులోన్నాము. అంటే మేము ఎలా ఉండేవాల్లమో ఆలోచించండి. నా పిల్లలు వాడిని చిన్నాన్న అనేవారు. ఒకసారి మా వాదనలో, నాకు కోపం వచ్చి నువ్వే కులం రా అని అడిగాను. వాడు క్రీస్టియన్ అని చెప్పాడు, అబే మతం పుచ్చుకోక ముందురా అంటే, షెడ్యూల్ కాస్ట్ అన్నాడు, అందులో ఎవడివిరా అంటే మాల అన్నాడు. వెంటనే నేను, నీ యబ్బా నీ కులం తెలుసుకోవడానికి నిన్ను మూడు ప్రశ్నలు వేస్తె కానీ సమాధానం రాలేదు, అదే నన్ను అడుగు, నేను రాజు ని అని వెంటనే చెబుతాను, నేను నిన్ను కించపరిచేనంటావేమిటిరా, నీ కులాన్ని నువ్వే కించపరుచుకుంటున్నావు, కానీ నా కులం మీద నాకు గౌరవం ఉంది, ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో, అపుడు నేను ఆటోమేటిక్ గా నిన్ను గౌరవిస్తాను అని బూతులు తిట్టాను. నిజమే పూర్వం అలాగే ఉండేది. ఇప్పుడు ఎక్కడోకానీ ఆ పరిస్థతి లేదు కదా.

నేను ఒక సారి పొలం రిజిస్ట్రేషన్ కి అని రిజిస్త్రార్ ఆఫీస్ కి వెళ్లాను. నా ముందు ఒక పెద్దతను లోపలికి వెళుతూ, చెప్పులు బయట విప్పి వెళుతున్నాడు. నేను అతన్ని ఆపి చెప్పులు విప్పి వెళ్ళడానికి ఇదేమి గుడి, హాస్పిటల్ కాదు, చెప్పులు వేసుకొని వెళ్ళు అన్నాను, అతను అయ్యా లోపల పెద్దాయన కదండీ అన్నాడు, బయటకోచ్చాకా మాట్లాడదాము ముందు చెప్పులు వేసుకొని వెళ్ళు అని చెప్పులు వేయిచి పంపాను. అతను వెళ్ళాకా పక్కనే ఉన్న కుర్రవాడిని నువ్వు ఎవరివి, అని అడిగితే ఆ పెద్దాయన కొడుకుని అన్నాడు. ఏమి చేస్తుంటావు అని అడిగితే, సి.ఆర్.రెడ్డి కాలేజ్ లో అటెండర్ ని అన్నాడు. అదేమిటయ్యా, కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్నావు, మీ నాన్న కి చెప్పలేవా అంటే అతను వెంటనే మేము షెడ్యూల్ కాస్ట్ అండీ అన్నాడు. అయితే ఏమిటి, ఇంకెప్పుడు ఆఫీస్ లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విప్పి వెళ్ళవద్దని చెప్పు మీ నాన్నకి అని తిట్టాను.

ఇంకోసారి ఒక ట్రాక్టర్ డీలర్ దగ్గరకి మా పినమావ గారు వెళదామంటే ఆయన తో కలసి వెళ్లాను. ఆయన లోపలకు వెళుతూ చెప్పులు విప్పారు. నేను బయట చూసాను. ఈయనవి ఒక్కటే ఉన్నాయి. లోపల ఉన్న వాళ్ళు చెప్పులుతోనే వున్నట్టు అర్థం అయ్యింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆఫీస్ లోకి వాళ్ళు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళరు. అటువంటప్పుడు మనం కూడా బయట వదలి వెళ్ళడం మర్యాద. కానీ ఇక్కడ అలా లేదు. నేను మాములుగానే వెళ్లాను. లోపల కూర్చున్నాకా, ఇద్దరూ రేట్ గురించీ, డెలివరీ గురించీ మాట్లాడుకున్నారు. ఈ లోపు ఆ ఓనర్ ఏదో పని మీద బయటకు వెళ్ళారు. నేను టేబుల్ మీద ఏవో కాగితాలు కనిపిస్తే అవి తీసి చూసా. ఆయన లోక్ సత్తా లో ఏదో మంచి పదవిలోనే ఉన్నారు. ఆ కాగితాలన్నీ వీళ్ళు పార్టీ తరపున లేబర్ ని ఎలా ఎడ్యుకేట్ చేసిందీ వివరిస్తూ, హైదరాబాద్ పంపేవి. అవి అన్నీ చదువుతుంటే ఆయన లోపలకోచ్చారు. నేను ఆయనతో మీరు ఇవన్నీ చెయ్యక్కరలేదు, ముందు వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ ని తగ్గించండి అన్నాను. నేను ఈ చెప్పుల విషయమే చెప్పాను. మీరు ప్రతీ ఆఫీస్ ముందు రోజు ఒక గంట నిలబడి లేబర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పులు విప్పకుండా లోపాలకి వెళ్లేటట్టు ఎడ్యుకేట్ చెయ్యండి చాలు. మనిషిలో బానిస మనస్తత్వం పొతే వాడికి వాడే ఎదుగుతాడు, మనం చెప్పక్కర్లేదు అన్నాను.

నా పాలేరు మొదట్లో చెరువులో మేతలు కట్టి అలా మురికిగానే కూర్చునేవాడు. నేను రెండు రోజులు చూసి, ఒరేయ్, పని అయ్యిపోయింది కదా, శుభ్రంగా స్నానం చేసి కూర్చోవచ్చుకదా అంటే మీ ఎదురుగా శుభ్రంగా ఎలా కూర్చుంటామండీ అన్నాడు. అంటే మనం వాళ్ళని ఏ స్టేజ్ కి తీసుకొనివెళ్ళామో ఆలోచించండి. అప్పుడు వాడిని మేతలు కట్టగానే పని ఏమీ లేకపోతే శుభ్రం గా ఉండేటట్టు తిట్టి మార్చవలసి వచ్చింది.

కృష్ణుడు పెట్టింది నాలుగు వర్ణాలే, మనమే దానిని మూడు వేల వర్ణాలుగా పెంచేసాము. తప్పు చేసేది మనమైతే, దానిని కృష్ణుడు మీదకి నేట్టడమేమిటి?

1 comment: